CM KCR: కేంద్రం నుంచి కేసీఆర్కు ఆహ్వానం.. మోడీ కార్యక్రమానికి రావాలని లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR: రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఈ నెల 12న పునఃప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఈనేపథ్యంలో కీలక చర్చ తెరపైకి వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఈ కార్యక్రమానికి వెళ్తారా అనే చర్చ సాగుతోంది. ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్రం నుంచి కేసీఆర్కు ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరించాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య కేసీఆర్కు లేఖ రాశారు. ఇప్పుడు కేంద్ర మంత్రి రాసిన లేఖపై కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. మోడీ తెలంగాణ టూర్పై టీఆర్ఎస్ ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. విభజన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ మేధావులు ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు.
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
ప్రధాని పర్యటనను అడ్డుకుంటామని వామపక్షాలు ఇప్పటికే ప్రకటించాయి. ఈ నేపథ్యంలో.. కేంద్ర మంత్రి లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ కార్యక్రమానికి కేసీఆర్ వెళితే వామపక్షాలు, టీఆర్ఎస్ వైఖరి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు తెలంగాణ బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఇతర నేతలతో కలిసి ప్రధాని మోదీ ప్రసంగించే బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించారు. ఏర్పాట్లను పర్యవేక్షించారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కేంద్రం రూ.6,120 కోట్లు వెచ్చించింది. దీని వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించాలని పార్టీ నేతలకు సూచించారు. ఈ ఎరువుల కర్మాగారాన్ని పునఃప్రారంభించడంతో తెలంగాణ, ఏపీ సహా దక్షిణ భారతదేశంలోని రైతులందరికీ ఎరువులు కొరత లేకుండా సరఫరా చేసేలా అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు.
Shiva Sahasranama Stotram : కార్తిక గురువారం ఈ స్తోత్రం వింటే మహా శివుని దీవెనలతో కోరిన కోరికలు నెరవేరుతాయి
తాజావార్తలు
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
-
CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
-
Off The Record: ఖమ్మంలో కలకలం.. గాయత్రి రవి కంపెనీలపై వరుస దాడులు ఎందుకు?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!