NTV Telugu Site icon

V. Hanumantha Rao: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. టార్గెట్ కేటీఆర్, హరీష్ రావు

V.hanumantha Rao

V.hanumantha Rao

V. Hanumantha Rao: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని నర్సాపూర్ లో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాకు రెండు మంత్రి పదవులు ఇవ్వండి అందరం వచేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారని తెలిపారు. అనవసరంగా మమ్మల్ని గెలికి మిమ్మల్ని మీరే బొంద పెట్టుకోకండని కీలక వ్యాఖ్యలు చేశారు. మేము ఒక్కసారి గేట్లు తెరిస్తేనే మీరు తట్టుకోలేదు…ఇక తెరిస్తే మీ పని ఖతం అని తెలిపారు. రేపటి నుంచి మా టార్గెట్ బావబామ్మర్దులు కేటీఆర్, హరీష్ రావు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. గోమారంలో జరిగిన చిన్న విషయాన్ని కావాలని రాజకీయం చేశారని మండిపడ్డారు.

భగవంతుడి దగ్గర కూడా అవినీతికి పాల్పడటం దౌర్భాగ్యమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు అన్నారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని దీక్షకు కూర్చున్నానని తెలిపారు. తిరుమల లో జరుగుతున్న ఘటన తీవ్రంగా కలిచివేసిందన్నారు. ప్రపంచంలోనే వెంకన్న లడ్డుకు పవిత్రత ఉంటుందని తెలిపారు. అలాంటి పవిత్రమైన లడ్డులో జంతువుల క్రొవ్వు కలపడం దారుణమన్నారు. ప్రపంచ దేశాలలో వెంకన్న భక్తులు ఉన్నారని తెలిపారు. గతంలో వైసీపీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉందన్నారు. తిరుమలలో దేవుడిపై ఒట్టు వేస్తూ రాజకీయం చేస్తున్నారని తెలిపారు. సీబీఐ విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయననారు. నేను చేస్తున్న దీక్షతో అయిన కేంద్ర ప్రభుత్వంలో చలనం రావాలన్నారు. ఈ సమస్య తొందరగా పరిష్కరించాలి… లేకపోతే ప్రజల్లో గందరగోళం పరిస్థితి ఏర్పడుతుందన్నారు. భగవంతుడి దగ్గర కూడా అవినీతికు పాల్పడటం దౌర్భాగ్యమన్నారు. సీబీఐ విచారణ త్వరగా చేసి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Minister Seethakka: ములుగు మున్సిపాలిటీ బిల్లుపై గవర్నర్ జిష్ణు దేవ్ తో సీతక్క భేటీ