Site icon NTV Telugu

నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు…

ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. ఈ బంగారాన్ని కొనుగోలు చేయడానికి చాలా మంది ఇష్టపడతారు. అందుకే దానికి మన దగ్గర ఎప్పుడు డిమాండ్ ఉంటూనే ఉంటుంది. కానీ ఈ కరోనా నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. అయితే గత వారం రోజుల నుంచి తగ్గిన బంగారం ధరలు… తాజాగా పెరిగాయి. ఈరోజు పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 పెరిగి రూ. 44,500 కి చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 330 పెరిగి రూ. 48,550 కి చేరింది. బంగారం ధరలతో పాటుగా వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండి ధర రూ. 1,600 పెరిగి రూ. 65,200 పలుకుతుంది.

Exit mobile version