Ponnam Prabhakar: గురుకుల పాఠశాలకు తాళాలు వేసిన వారిపై క్రిమినల్ కేసులు..
- రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకుల పాఠశాలు..
- అద్దె చెల్లించలేదని పాఠశాలలకు తాళాలు వేసిన యాజమాన్యాలు..
- పాఠశాల గేట్లకు తాళాలు వేసిన వారిపై క్రిమినల్ కేసులు వేయాలని కలెక్టర్లకు మంత్రి ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar: రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకుల పాఠశాలలకు యాజమాన్యాలు తాళాలు వేసిన విషయం తెలిసిందే. సుమారు 9 నెలలుగా ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ భవనాల యజమానులు మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల, హాస్టళ్లకు తాళాలు వేశారు. దీనిపై రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. గురుకుల పాఠశాల గేట్లకు తాళాలు వేసిన వారిపై క్రిమినల్ కేసులు వేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికీ 70 శాతం గురుకులాలు అద్దె భవనాల్లోనే వున్నాయని తెలిపారు. గత కొద్ది సంవత్సరాలుగా రాని బకాయిలు అడగలేక.. నేడో, రేపో నిధులు విడుదల చేసే సమయంలో ఇలా గురుకులాలకు తాళం వేయడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. ఎవరి మాటలు పట్టుకొని కవ్వింపు చర్యలకు పాల్పడవద్దు అని సూచించారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించే ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. పాత బకాయిలు ఇప్పించే బాధ్యత మాదని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
Read also: Telangana: గురుకుల పాఠశాలలకు తాళాలు.. బయటే టీచర్లు, విద్యార్దుల నిరీక్షణ..
Also Read
- KCR Meeting : ఎర్రవల్లి వేదికగా కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. బీఆర్ఎస్ ప్రక్షాళనకు శ్రీకారం..!
- Women Commission : తెలంగాణ మహిళా కమిషన్లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
- CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం
- HAM Projects : తెలంగాణలో రహదారుల విప్లవం.. 'హ్యామ్' ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక సమీక్ష
మరి దీనిపై గురుకులాలకోసం అద్దెకు ఇచ్చిన యాజమాన్యం ఎలా స్పందిస్తుందనే దానిపై ఉత్కంఠంగానే ఉంది. ఇప్పటి వరకు గురుకులాలకు తాళం వేసింది వేసినట్లే ఉంది. మరి మంత్రి ఆదేశాలతో జిల్లా కలెక్టర్లు ఎంట్రీ ఇచ్చి గురుకులాలకు వేసిన తాళాలు తీసివేస్తారా? అద్దెకు ఇచ్చిన యాజమాన్యాలతో కలెక్టర్లు సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితి ఏవిధంగా పరిశీలించనున్నారో మరి. అయితే దసరా సెలవుల అనంతరం గురుకులాలకు వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు అద్దె భవనాల యాజమాన్యం తాళం వేయడంతో బయటే నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ప్రభుత్వం గురుకులాల భవనాల అద్దెలను ఎప్పుడు చెల్లిస్తుందనే దానిపై ఇంకా క్లారీటీ లేదు. దీనిపై అద్దెకు ఇచ్చిన యాజమాన్యం మాత్రం స్పందించకపోవడం గమనార్హం.
MP Dharmapuri Arvind: మంత్రి కోమటిరెడ్డి నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు..
తాజావార్తలు
-
KCR Meeting : ఎర్రవల్లి వేదికగా కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. బీఆర్ఎస్ ప్రక్షాళనకు శ్రీకారం..!
-
Telangana Exhibitors : టాలీవుడ్ స్టార్ హీరోలు, నిర్మాతలకు అల్టిమేటం!
-
Keir Starmer: బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్కు పదవీ గండం.. యూకేలో అసలేం జరుగుతోంది?
-
NEET Paper Leak: నీట్ పేపర్ లీక్లో మాస్టర్ మైండ్ అరెస్ట్.. లీక్ జరిగింది ఇలా..
-
Norovirus vs Hantavirus: నొప్పులు, వాంతులు, అలసట, తలనొప్పి.. కరోనా, నోరో కంటే డేంజర్? దడపుట్టిస్తోన్న హాంటా..!
ట్రెండింగ్
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!