Site icon NTV Telugu

మద్యం మత్తులో పాదచారులను ఢీకొట్టిన పోలీస్‌ డ్రైవర్‌..

కాలాపతేర్ వద్ద సోమవారం పోలీసు వాహనం డ్రైవర్ మద్యం మత్తులో తన వాహనంతో ముగ్గురు పాదచారులను ఢీకొట్టారు. ఢీకొట్టడంతో ముగ్గురు పాదచారులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌత్‌జోన్‌ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు అనుబంధంగా పనిచేస్తున్న డ్రైవర్‌ శ్రీనివాస్‌ సాయంత్రం వాహనంలో కాలాపతేర్‌కు వెళ్లే సమయంలో మద్యం మత్తులో ఉన్నాడు. అతనితో పాటు అతని స్నేహితుడు కూడా ఉన్నాడు.

వాహనం తాడ్‌బన్ క్రాస్‌రోడ్ వద్దకు చేరుకోగానే డ్రైవర్ అదుపు తప్పి ముగ్గురు పాదచారులను ఢీకొట్టినట్లు సమాచారం. వెంటనే పెద్ద ఎత్తున జనం గుమిగూడి వాహనాన్ని ఆపారు. కాలాపతేర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version