Hyderabad: శ్రీనగర్ కాలనీ సబ్ స్టేషన్ ముందు ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
- జనవాసాల మధ్య నుంచి 34 కేవి హై టెన్షన్ లైన్ తొలగించాలంటూ స్థానికుల ఆందోళన..
- శ్రీనగర్ కాలనీ సబ్ స్టేషన్ ముందు స్థానికుల నిరసన..
- భారీగా పోలీసుల మోహరింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: శ్రీనగర్ కాలనీ సబ్ స్టేషన్ ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. శ్రీనగర్ ఎల్లారెడ్డిగూడెలో హై టెన్షన్ కరెంట్ వైర్లు తెగిపడ్డాయి. ప్రభుత్వ స్కూల్ పై కరెంటు లైన్ తెగిపడింది. ప్రమాదం గుర్తించిన యాజమాన్యం విద్యార్థులను స్కూల్ నుంచి బయటకు తీసుకుని వచ్చారు. దీంతో విద్యార్థులకు తృటిలో ప్రమాదం తప్పంది. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవాసాల మధ్య నుంచి 34 కేవి హై టెన్షన్ లైన్ తొలగించాలంటూ ఆందోళన చేపట్టారు. శ్రీనగర్ కాలనీ సబ్ స్టేషన్ ముందు స్థానికుల నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడకు పోలీసులు భారీగా మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. స్థానికులతో కలిసి సోమాజిగూడ కాంగ్రెస్ కార్పొరేటర్ ఆందోళనకు దిగారు.
Read also: CM Revanth Reddy: మీ ప్రకటనలో అపోహలు.. అవాస్తవాలు.. ప్రధాని మోడీ కి సీఎం రేవంత్ ట్వీట్..
Also Read
- Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
- HMDA Mokila Layout : మోకిలా లేఅవుట్ ఈ-వేలానికి భారీ స్పందన.. HMDAకు రూ. 231.65 కోట్ల ఆదాయం.!
- CM Revanth Reddy : అగ్రికల్చర్ పక్కనపెట్టి డ్రింకింగ్ కల్చర్ తెచ్చారు..
- CM Revanth Reddy : కేసీఆర్కు రేవంత్ ఓపెన్ ఛాలెంజ్.!
ఎల్లారెడ్డిగూడ శ్రీనగర్ కాలనీ వాసులు మాట్లాడుతూ.. ఎల్లారెడ్డిగూడ శ్రీనగర్ కాలనీ లో ఉదయం హై టెన్షన్ కరెంట్ వైర్లు తెగిపడ్డాయి. పెద్ద శబ్దం వచ్చింది భయంతో ఇంట్లో నుండి అందరం పరుగులు తీశామన్నారు. సబ్ స్టేషన్ పక్కనే ప్రభుత్వ పాటశాలపై కరెంటు వయర్ తెగి పడిందని అన్నారు. అదృష్టం బాగుండి విద్యార్థులకు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అన్నారు. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఎవరు దానికి బాధ్యత వహిస్తారు? అని ప్రశ్నించారు. జనవాసాల మధ్య నుంచి 34 కేవి హై టెన్షన్ లైన్ తొలగించాలని గతంలో ఎన్నో సార్లు ఆందోళన చేసామమన్నారు. శ్రీనగర్ కాలనీ 34కేవీ సబ్ స్టేషన్ ముందు ఆందోళన చేసాము ఇప్పటివరకు ఎవరు స్పందించలేదన్నారు. గతంలో ఇలాగే హై టెన్షన్ వైర్స్ తెగిపడి కరెంట్ షాక్ తగిలి ఓ మహిళ మృతి చెందిందని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి హైటెన్షన్ కరెంట్ వైర్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. మరి దీనిపై అధికారుల వద్ద నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.
Ponnam Prabhakar: దేశం మొత్తానికి సమగ్ర సర్వే దిక్సూచి.. నవంబర్ 6 నుండి ప్రారంభం..
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!