Hyderabad: శ్రీనగర్ కాలనీ సబ్ స్టేషన్ ముందు ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
- జనవాసాల మధ్య నుంచి 34 కేవి హై టెన్షన్ లైన్ తొలగించాలంటూ స్థానికుల ఆందోళన..
- శ్రీనగర్ కాలనీ సబ్ స్టేషన్ ముందు స్థానికుల నిరసన..
- భారీగా పోలీసుల మోహరింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: శ్రీనగర్ కాలనీ సబ్ స్టేషన్ ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. శ్రీనగర్ ఎల్లారెడ్డిగూడెలో హై టెన్షన్ కరెంట్ వైర్లు తెగిపడ్డాయి. ప్రభుత్వ స్కూల్ పై కరెంటు లైన్ తెగిపడింది. ప్రమాదం గుర్తించిన యాజమాన్యం విద్యార్థులను స్కూల్ నుంచి బయటకు తీసుకుని వచ్చారు. దీంతో విద్యార్థులకు తృటిలో ప్రమాదం తప్పంది. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవాసాల మధ్య నుంచి 34 కేవి హై టెన్షన్ లైన్ తొలగించాలంటూ ఆందోళన చేపట్టారు. శ్రీనగర్ కాలనీ సబ్ స్టేషన్ ముందు స్థానికుల నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడకు పోలీసులు భారీగా మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. స్థానికులతో కలిసి సోమాజిగూడ కాంగ్రెస్ కార్పొరేటర్ ఆందోళనకు దిగారు.
Read also: CM Revanth Reddy: మీ ప్రకటనలో అపోహలు.. అవాస్తవాలు.. ప్రధాని మోడీ కి సీఎం రేవంత్ ట్వీట్..
Also Read
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
- CM Revanth Reddy : బుల్లెట్ ట్రైన్ ల్యాండ్ అక్విజిషన్, టీ-ఫైబర్ పై సీఎం రేవంత్ డెడ్లైన్.!
- CM Revanth Reddy : నెట్ జీరో సిటీగా 'భారత్ ఫ్యూచర్ సిటీ'.. ఇన్వెస్టర్ల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సెల్.!
ఎల్లారెడ్డిగూడ శ్రీనగర్ కాలనీ వాసులు మాట్లాడుతూ.. ఎల్లారెడ్డిగూడ శ్రీనగర్ కాలనీ లో ఉదయం హై టెన్షన్ కరెంట్ వైర్లు తెగిపడ్డాయి. పెద్ద శబ్దం వచ్చింది భయంతో ఇంట్లో నుండి అందరం పరుగులు తీశామన్నారు. సబ్ స్టేషన్ పక్కనే ప్రభుత్వ పాటశాలపై కరెంటు వయర్ తెగి పడిందని అన్నారు. అదృష్టం బాగుండి విద్యార్థులకు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అన్నారు. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఎవరు దానికి బాధ్యత వహిస్తారు? అని ప్రశ్నించారు. జనవాసాల మధ్య నుంచి 34 కేవి హై టెన్షన్ లైన్ తొలగించాలని గతంలో ఎన్నో సార్లు ఆందోళన చేసామమన్నారు. శ్రీనగర్ కాలనీ 34కేవీ సబ్ స్టేషన్ ముందు ఆందోళన చేసాము ఇప్పటివరకు ఎవరు స్పందించలేదన్నారు. గతంలో ఇలాగే హై టెన్షన్ వైర్స్ తెగిపడి కరెంట్ షాక్ తగిలి ఓ మహిళ మృతి చెందిందని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి హైటెన్షన్ కరెంట్ వైర్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. మరి దీనిపై అధికారుల వద్ద నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.
Ponnam Prabhakar: దేశం మొత్తానికి సమగ్ర సర్వే దిక్సూచి.. నవంబర్ 6 నుండి ప్రారంభం..
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!