BRS KTR: ఢిల్లీ పర్యటనలో కేటీఆర్.. అసలు విషయం ఇదేనా..
- ఢిల్లీ పర్యటనలో మాజీమంత్రి కేటీఆర్..
- ఇవాళ ఉదయం 11 గంటలకు కేటీఆర్ ప్రెస్ మీట్..
- నిన్న సాయంత్రం కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిసిన కేటీఆర్..
- అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందని పిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS KTR: మాజీమంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. నిన్న సాయంత్రం కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కేటీఆర్ కలిశారు. అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందని ఫిర్యాదు చేశారు. అనంతరం దీనిపై ఇవాళ ఉదయం 11 గంటలకు కేటీఆర్ ప్రెస్ మీట్ లో మాట్లాడనున్నారు. కాగా.. అమృత్ పథకం టెండర్లలో పలు నేతలు భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని కేటీఆర్ ఆరోపించారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనను ఉల్లంఘించి వారి కుటుంబ సభ్యులకే కంపెనీకి రూ. 1,137 కోట్ల విలువ చేసే పనులను అప్పగించారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధనను ఉల్లఘించిన వారు ఎంతటి వారైనా వారిపై వేటు వేయొచ్చని కేటీఆర్ తెలిపారు. దీనికి సంబంధించి పలు కేసులను కూడా ఆయన వెల్లడించారు. టెండర్లలో చట్టవిరుద్దంగా జరిగిన కేటాయింపులు, అక్రమ ఒప్పందాలపై విచారణ జరపాలని, అక్రమాలు నిజమని తేలితే టెండర్లు రద్దు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Read also: Atrocious: నగరంలో దారుణం.. భార్యను గొంతు కోసి తగలబెట్టిన భర్త..
Also Read
- Telangana Sports : గాయత్రి-త్రిసాకు సీఎం రేవంత్ అభినందనలు.. గోపీచంద్తో స్పెషల్ మీట్
- Hyderabad Pan Masala Raid: హైదరాబాద్లో పాన్ మసాలా దందా.. రూ.160 కోట్ల స్కామ్..
- Kishan Reddy: రేవంత్ అమెరికా టూర్ రద్దు.. కిషన్ రెడ్డి కౌంటర్..!
- Telangana Congress : కాంగ్రెస్లో బిగ్ షాక్.. కొండా సురేఖ, చిన్నారెడ్డికి ఎసరు.?
మరోవైపు కేటీఆర్ ఈ సందర్భంగా ఢిల్లీ చేరుకోగానే ‘X’లో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. ‘ఇప్పుడే ఢిల్లీలో అడుగు పెట్టా.. హైదరాబాద్లో అప్పుడే వణికిపోతే ఎలా?.. హైదరాబాద్లో ప్రకంపనలు కనిపిస్తున్నాయి’. అని కేటీఆర్ పేర్కొన్నారు. మరోవైపు.. కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయింలో విమర్శలు చేస్తున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కలిసి కేసులు విత్ డ్రా చేసుకునేందుకు ఢిల్లీ వెళ్ళారా.. మీ తప్పులు మాఫీ చేయించుకునేందుకు బీజేపీ నేతలను కలవడానికి ఢిల్లీ వెళ్లారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై కేటీఆర్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
Warangal: నేడు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకానున్న ఎమ్మార్వోలు.. ఏం జరిగింది..
తాజావార్తలు
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు!
-
Boltt Ace 5G, Evo: బోల్ట్ ఏస్ 5G, ఇవో రిలీజ్.. 6000mAh బ్యాటరీ, 64MP AI కెమెరా, 8GB ర్యామ్.. ధర, ఫీచర్లు ఇవే
-
US Iran Sanctions: ఇరాన్తో ఆయిల్ డీల్స్.. 4 భారతీయ కంపెనీలపై ట్రంప్ ఆంక్షలు! అసలు కారణం ఇదే
-
Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
-
Toxic Advance Booking: ఒక్క గంటలోనే లక్ష టికెట్లు.. యష్ సినిమాకు మామూలు క్రేజ్ కాదు!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!