DSC Recruitment Process: సెప్టెంబర్ నుంచి డీఎస్సీ నియామక ప్రక్రియ..?
- ఉపాధ్యాయ నియామక ప్రక్రియను సెప్టెంబర్ నెలాఖరు నుంచి చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయం..
- అందుకు సంబంధించిన కసరత్తును చేపట్టేందుకు ప్రయత్నాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DSC Recruitment Process: ఉపాధ్యాయ నియామక ప్రక్రియను సెప్టెంబర్ నెలాఖరు నుంచి చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించిన కసరత్తును చేపట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రాథమిక కీ ఇప్పటికే విడుదలైన విషయం తెలిసిందే.. అభ్యంతరాలను పరిశీలించి తుది కీని ఈ నెలాఖరులోగా విడుదల చేయనున్నారు. మరోవైపు జిల్లాల వారీగా పోస్టులు, డీఎస్సీ పరీక్షల అభ్యర్థుల వివరాలను క్రోడీకరించారు. రోస్టర్ విధానం, వివిధ కేటగిరీ పోస్టుల విభజనపై అధికారులు దృష్టి సారించారు. ఆన్లైన్లో పరీక్ష నిర్వహించడం వల్ల ఫలితాలు సులువుగా ప్రకటించవచ్చని అధికారులు చెబుతున్నారు. తుది కీ విడుదల చేసిన రోజునో.. లేదా మరుసటి రోజునో ఫలితాలు ప్రకటించవచ్చు. ఆ తర్వాత వారం రోజుల్లో సీనియారిటీ జాబితా రూపొందించే యోచనలో ఉన్నారు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇటీవల పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు 3,29,897 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 2,79,957 మంది పరీక్షకు హాజరయ్యారు.
Read also: Rythu Runa Mafi: రూ.2 లక్షల పైనున్న అప్పులు ఆగస్టు 15వ తేదీ తర్వాత..
Also Read
- Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్లకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు గడువు.!
కొత్తగా భర్తీ చేసే అన్ని ఉద్యోగ నియామకాల్లో షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణ అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల శాసనసభలో చెప్పారు. అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తెస్తాం. అయితే వర్గీకరణపై తీర్పు రాకముందే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. కాబట్టి ఈ నియామకాలకు వర్గీకరణ అంశాన్ని జోడిస్తే న్యాయపరమైన సమస్యలు వస్తాయని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వర్గీకరణ అంశం ముందుకు వస్తే.. నిర్ణీత తేదీల్లో ఉపాధ్యాయుల నియామకం కష్టసాధ్యమనే అనుమానాలు అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
Read also: 3rd Rythu Runa Mafi: నేడే మూడో విడత రుణమాఫీ.. వైరా సభలో చెక్కులు అందజేయనున్నసీఎం రేవంత్
ఇక జిల్లాల వారీగా పోస్టులు, ఇతర అంశాలకు సంబంధించిన డేటాను రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టరేట్ పరిధిలో రోస్టర్ విధానంలో తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ప్రతి జిల్లాలో ముగ్గురు ఉపాధ్యాయులను ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసి ఆ జాబితాను మాత్రమే జిల్లా కేంద్రాలకు పంపాలని నిర్ణయించారు. జిల్లా ఎంపిక కమిటీ ఈ ముగ్గురిలో ఒకరిని ఎంపిక చేస్తుంది. వ్యక్తిగత వివరాల విచారణ నివేదికలను తీసుకురావడానికి అన్ని జిల్లాల పోలీసు అధికారులకు జాబితాలను కేంద్ర కార్యాలయం నుండి పంపాలని భావిస్తున్నారు. సెప్టెంబరు మూడో వారంలోగా ఈ ప్రక్రియ పూర్తి చేసి నాలుగో వారం నుంచి జిల్లా కేంద్రాల్లో నియామక ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నారు. ఆలస్యమైతే అక్టోబర్ మొదటి వారంలో రిక్రూట్మెంట్ ప్రక్రియ జరిగే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. అయితే అక్టోబర్ నెలాఖరులోగా అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందజేసేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
CM Revanth Reddy: నేడు 78వ స్వాతంత్య్ర దినోత్సవం.. సీఎం రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్..
తాజావార్తలు
-
Ajinkya Rahane: టీమిండియా టెస్ట్ టీమ్ కోసం మేం ముగ్గురం ఎంతో కష్టపడ్డాం!
-
Ethanol in Diesel: డీజిల్లో ఇథనాల్కు బ్రేక్.. వెనక్కి తగ్గిన కేంద్రం.. అసలు కారణం ఇదే..!
-
IRUMUDI : ఇరుముడి కథ, కథనం ఏంటో చెప్పేసిన దర్శకుడు శివ నిర్వాణ
-
ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్కప్ బెర్త్ కోసం పాకులాట!
-
RD Burman Biopic: రాజేష్ ఖన్నాగా అక్షయ్, మెహమూద్గా ఇమ్రాన్… త్వరలోనే ఆర్డీ బర్మన్ బయోపిక్ షూటింగ్
ట్రెండింగ్
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!