DSC Recruitment Process: సెప్టెంబర్ నుంచి డీఎస్సీ నియామక ప్రక్రియ..?
- ఉపాధ్యాయ నియామక ప్రక్రియను సెప్టెంబర్ నెలాఖరు నుంచి చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయం..
- అందుకు సంబంధించిన కసరత్తును చేపట్టేందుకు ప్రయత్నాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DSC Recruitment Process: ఉపాధ్యాయ నియామక ప్రక్రియను సెప్టెంబర్ నెలాఖరు నుంచి చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించిన కసరత్తును చేపట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రాథమిక కీ ఇప్పటికే విడుదలైన విషయం తెలిసిందే.. అభ్యంతరాలను పరిశీలించి తుది కీని ఈ నెలాఖరులోగా విడుదల చేయనున్నారు. మరోవైపు జిల్లాల వారీగా పోస్టులు, డీఎస్సీ పరీక్షల అభ్యర్థుల వివరాలను క్రోడీకరించారు. రోస్టర్ విధానం, వివిధ కేటగిరీ పోస్టుల విభజనపై అధికారులు దృష్టి సారించారు. ఆన్లైన్లో పరీక్ష నిర్వహించడం వల్ల ఫలితాలు సులువుగా ప్రకటించవచ్చని అధికారులు చెబుతున్నారు. తుది కీ విడుదల చేసిన రోజునో.. లేదా మరుసటి రోజునో ఫలితాలు ప్రకటించవచ్చు. ఆ తర్వాత వారం రోజుల్లో సీనియారిటీ జాబితా రూపొందించే యోచనలో ఉన్నారు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇటీవల పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు 3,29,897 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 2,79,957 మంది పరీక్షకు హాజరయ్యారు.
Read also: Rythu Runa Mafi: రూ.2 లక్షల పైనున్న అప్పులు ఆగస్టు 15వ తేదీ తర్వాత..
Also Read
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- DGP CV Anand: "ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్".. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
- Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
కొత్తగా భర్తీ చేసే అన్ని ఉద్యోగ నియామకాల్లో షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణ అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల శాసనసభలో చెప్పారు. అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తెస్తాం. అయితే వర్గీకరణపై తీర్పు రాకముందే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. కాబట్టి ఈ నియామకాలకు వర్గీకరణ అంశాన్ని జోడిస్తే న్యాయపరమైన సమస్యలు వస్తాయని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వర్గీకరణ అంశం ముందుకు వస్తే.. నిర్ణీత తేదీల్లో ఉపాధ్యాయుల నియామకం కష్టసాధ్యమనే అనుమానాలు అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
Read also: 3rd Rythu Runa Mafi: నేడే మూడో విడత రుణమాఫీ.. వైరా సభలో చెక్కులు అందజేయనున్నసీఎం రేవంత్
ఇక జిల్లాల వారీగా పోస్టులు, ఇతర అంశాలకు సంబంధించిన డేటాను రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టరేట్ పరిధిలో రోస్టర్ విధానంలో తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ప్రతి జిల్లాలో ముగ్గురు ఉపాధ్యాయులను ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసి ఆ జాబితాను మాత్రమే జిల్లా కేంద్రాలకు పంపాలని నిర్ణయించారు. జిల్లా ఎంపిక కమిటీ ఈ ముగ్గురిలో ఒకరిని ఎంపిక చేస్తుంది. వ్యక్తిగత వివరాల విచారణ నివేదికలను తీసుకురావడానికి అన్ని జిల్లాల పోలీసు అధికారులకు జాబితాలను కేంద్ర కార్యాలయం నుండి పంపాలని భావిస్తున్నారు. సెప్టెంబరు మూడో వారంలోగా ఈ ప్రక్రియ పూర్తి చేసి నాలుగో వారం నుంచి జిల్లా కేంద్రాల్లో నియామక ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నారు. ఆలస్యమైతే అక్టోబర్ మొదటి వారంలో రిక్రూట్మెంట్ ప్రక్రియ జరిగే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. అయితే అక్టోబర్ నెలాఖరులోగా అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందజేసేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
CM Revanth Reddy: నేడు 78వ స్వాతంత్య్ర దినోత్సవం.. సీఎం రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్..
తాజావార్తలు
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!