Telangana Colleges Bandh: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వృత్తి విద్యా కళాశాలలు ఈ నెల (సెప్టెంబర్) 15వ తేదీ నుంచి బంద్ కు సిద్ధమవుతున్నాయి. ఫీజు రీ ఇంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య (Federation of Associations of Telangana Higher Education Institutes – FATHI) కార్యవర్గం అత్యవసరంగా భేటీ అయింది. ఈ సమావేశంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఎడ్, ఎంబీఏ, ఎంసీఏ, లా, నర్సింగ్ తదితర కళాశాలల రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. మీటింగ్ అనంతరం సమాఖ్య నాయకులు మాట్లాడుతూ.. సుమారు 8 వేల కోట్ల రూపాయల ఫీజు రీ ఇంబర్స్మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది.. తక్షణమే ఈ బకాయిలు రిలీజ్ చేయకపోతే విద్యా రంగం తీవ్రంగా దెబ్బతింటుంది.. కళాశాలల నిర్వహణ అసాధ్యమవుతుందని పేర్కొన్నారు.
Read Also: Arjun Tendulkar: ఎంగేజ్మెంట్ అనంతరం మొదటి మ్యాచ్.. బౌలింగ్, బ్యాటింగ్లో అదరగొట్టిన అర్జున్!
అలాగే, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కళాశాలల యాజమాన్యాలు ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో చైర్మన్ను కలిసి మెమోరాండం అందజేశారు. అయినప్పటికీ తెలంగాణ సర్కార్ స్పందించకపోవడంతో, ఈ నెల 15వ తేదీ నుంచి వృత్తి విద్యా కళాశాలలను బంద్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ బంద్ కారణంగా స్టూడెంట్స్ భవిష్యత్తు తీవ్ర ప్రభావితం అవుతుందని విద్యార్థుల పేరేంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తూ, తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
