Site icon NTV Telugu

CM Revanth Reddy: విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్.. చారిత్రక కట్టడాలు ఉచితంగా సందర్శించే అవకాశం..

Telangana Darshan

Telangana Darshan

CM Revanth Reddy: సీఎం రేవంత్ సర్కార్ తాజాగా కొత్త నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రదేశాలు, చారిత్రక కట్టడాలను ఉచితంగా సందర్శించే అవకాశం విద్యార్థులకు కల్పిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం ‘తెలంగాణ దర్శిని’ పేరుతో కొత్త కార్యక్రమాన్ని తీసుకొస్తున్నట్లు వివరించారు. తెలంగాణ దర్శి కార్యక్రమంలో భాగంగా 2 నుంచి 4వ తరగతి విద్యార్థులను పర్యాటక ప్రాంతాలకు రోజు విహారయాత్రలకు తీసుకెళ్తారు. వారసత్వ ప్రదేశాలు, ఉద్యానవనాలు, స్మారక చిహ్నాలను చూపుతూ చారిత్రక ప్రదేశాల ప్రాముఖ్యతను వివరిస్తారు. 5 నుంచి 8వ తరగతి విద్యార్థులకు 20-30 కిలోమీటర్ల పరిధిలో రోజు పర్యటనలు ఉంటాయి.

ఈ యాత్రల్లో విద్యార్థులు ముఖ్యమైన చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలను సందర్శిస్తూ తెలంగాణ ప్రత్యేకతలను తెలుసుకుంటారు. 9వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు రెండు రోజుల పాటు 50-70 కి.మీ పరిధితో లాంగ్ ట్రిప్పులు నిర్వహిస్తారు. ఇది స్థానిక చరిత్ర, సంస్కృతి, శిల్ప సంపదను తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. యూనివర్సిటీ విద్యార్థులు తమ సొంత జిల్లాలకు మించి సుదూర ప్రాంతాలకు నాలుగు రోజుల పర్యటనలకు వెళ్లేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించడం ద్వారా విద్యార్థులు కేవలం పుస్తకాల్లోని పాఠాలకే పరిమితం కాకుండా చరిత్రను తెలుసుకునే అవకాశం ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని సచివాలయంలో తెలంగాణ పర్యాటక రంగ అభివృద్ధికి టీ సర్కార్ చర్యలు చేపట్టింది. ఉస్మానియా యూనివర్శిటీలోని మహాలఖ స్టెప్ వెల్ పునరుద్ధరణ కాంట్రాక్టును ఇన్ఫోసిస్ కంపెనీ అప్పగించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. పురాతన కట్టడాలను పరిరక్షించే లక్ష్యంతో రాష్ట్ర పర్యాటక శాఖ ఇటీవల సీఐఐతో ఒప్పందం కుదుర్చుకుంది.
Naini Rajender Reddy: వాడు వీడు అనడం మంచి పద్దతి కాదు.. కేటీఆర్ పై నాయిని ఫైర్

Exit mobile version