BRS MLA Into Congress: కాంగ్రెస్ లో చేరిన బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి.. రేపు మరో నలుగురు..!
- కాంగ్రెస్ లోకి గద్వాల బీఆరెస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి..
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన కృష్ణ మోహన్ రెడ్డి..
- రేపు మరో నలుగురు బీఆర్ఎస్ లు చేరే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS MLA Into Congress: తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ నుంచి వరుస వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. జూబ్లీహిల్స్ సీఎం నివాసంలో కండువా కప్పి కృష్ణమోహన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. రేపు చేరాల్సి ఉండే.. జిల్లా రాజకీయ పరిస్థితులు దృష్ట్యా ఇవాళ చేరడం గమనార్హం. కాంగ్రెస్ లో రేపు మరో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు చేరే అవకాశం ఉన్నట్లు టాక్. కాగా ఇవాళ ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాలు శ్రీధర్ బాబును బీఆర్ఎస్ నేతలు కలవనున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకుంది. ఈ కార్యక్రమంలో.. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్ పాల్గొన్నారు.
Read also: Balkampet Yellamma: బల్కంపేట రోడ్డు మూసివేత.. మళ్లింపు ఇలా..
Also Read
- SIR Survey : మాది ఏ రాష్ట్రమో తేల్చండి.. తెలంగాణలోని ఆ గ్రామాల్లో ‘సర్’ ప్రక్రియకు బ్రేక్..
- Kishan Reddy vs Asaduddin Owaisi: అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్.. ప్రజలను తప్పుదారి పట్టించొద్దు..!
- Vijayashanthi : ఫీజు బకాయిలపై విజయశాంతి ఫైర్.!
- Bhatti Vikramarka : డ్రగ్స్పై భట్టి వార్నింగ్.. ఎంతటి వారైనా వదిలేదే లేదు.!
బీఆర్ఎస్కు షాక్ ఇచ్చి ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఐదారుగురు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రేపో మాపో కాంగ్రెస్ కండువా కూడా కప్పుకుంటారని హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీని వీడి కాంగ్రెస్లో చేరుతున్న ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ అగ్రనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్లో చేరడంపై విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన కాంగ్రెస్లో చేరిన నేతలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
Hyderabad Rains: హైదరాబాద్ కు పొంచి ఉన్న వరుణుడి ముప్పు.. రెండు రోజులు భారీ వర్షాలు..
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!