HYDRA : అమీర్‌పేట్-మైత్రి వనం వరద సమస్యలపై హైడ్రా కమిషనర్ రంగంలోకి

  • అమీర్‌పేట్–మైత్రి వనం వరద సమస్యలపై పరిశీలన
  • కృష్ణకాంత్ పార్క్ చెరువులోకి వరద మళ్లింపు ప్రణాళిక
  • సారధి స్టూడియో–మధుర నగర్ కాలువపై సమీక్ష
  • శాశ్వత పరిష్కారానికి ట్రంక్ లైన్ ఏర్పాటు కసరత్తు
Hydra

Hydra

HYDRA : నగరంలో వరద సమస్యలు మరింత తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ శుక్రవారం అమీర్‌పేట్, మైత్రి వనం పరిసర ప్రాంతాలను పర్యటించారు. మైత్రి వనం వద్ద వరద ఉధృతి తగ్గించేందుకు చేపట్టవలసిన చర్యలపై ఆయన ఆధ్వర్యంలోనే పరిశీలనలు జరిపారు. ట్రంక్ లైన్ ఏర్పాటు చేయడం, తాత్కాలిక ఉపశమన చర్యలు చేపట్టడం వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ జూబ్లీ హిల్స్, వెంకటగిరి, రహ్మత్ నగర్, యూసఫ్‌గూడ ప్రాంతాల నుండి కృష్ణకాంత్ పార్క్ మీదుగా పారే వరద కాలువను కూడా పరిశీలించారు. పైప్రాంతాల నుండి వచ్చే వరద నీటిని కృష్ణకాంత్ పార్క్‌లోని చెరువులోకి మళ్లిస్తే, కొంత మేరకు వరద ఉధృతిని నియంత్రించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

Harinya Reddy: బిగ్ బాస్ కీలక టీం మెంబర్, ప్రొడ్యూసర్.. రాహుల్ చేసుకోబోయే అమ్మాయి షాకింగ్ బ్యాక్ గ్రౌండ్

అలాగే సారధి స్టూడియో నుండి మధుర నగర్ మీదుగా వచ్చే కాలువలో ఏర్పడుతున్న అడ్డంకులపై కూడా కమిషనర్ సమీక్షించారు. ఈ సమస్యను సమయానికి పరిష్కరిస్తే స్థానికులకు ఎదురవుతున్న ఇబ్బందులు తగ్గుతాయని అధికారులు ఆయనకు వివరించారు. మొత్తం మీద నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో తక్షణ ఉపశమనానికి చర్యలు తీసుకోవాలని, శాశ్వత పరిష్కారంగా ట్రంక్ లైన్ ఏర్పాటు కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు.

సీఈసీ జ్ఞానేష్ కుమార్ పై అభిశంసన తీర్మానం పెట్టాలని ఇండియా కూటమి నిర్ణయం