CS Shanti kumari: వరద నీరు చేరకుండా చర్యలు తీసుకోండి.. అధికారులకు సీఎస్ ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CS Shantikumari: భారీ వర్షాల కారణంగా నగరంలో ట్రాఫిక్ జామ్, వరద నీటి నిల్వ వంటి సమస్యల పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం ఆమె సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. డీజీపీ రవిగుప్తా, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, వాటర్ బోర్డు ఎండీ సుదర్శన్రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాంతికుమారి మాట్లాడుతూ వర్షాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు తగిన వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు.
Read also: Kajal Aggarwal: సరికొత్త అందాలతో అలరిస్తున్న కాజల్ అగర్వాల్
Also Read
- CM Revanth: రూ.1000 కోట్ల నిధులపై సీఎం ఫోకస్.. అధికారులకు సీరియస్ వార్నింగ్.!
- Ponnam Prabhakar - Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్..
- Hyderabad Online Betting: భారీ ఆన్లైన్ బెట్టింగ్ మాఫియా గుట్టురట్టు.. 13 మంది అరెస్ట్.! వేల కోట్ల లావాదేవీలపై CID దర్యాప్తు..
- RCB Fans Celebrations: అర్థరాత్రి RCB ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. పోలీసుల లాఠీచార్జ్.!
హైదరాబాద్లో దాదాపు 134 ప్రాంతాలను ప్రమాదకర ప్రాంతాలుగా గుర్తించామని చెప్పారు. ఈ ప్రాంతాల్లో వరద నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ, వాటర్బోర్డు, పోలీస్, ఎస్పీడీసీఎల్, ఇతర శాఖలు, సంస్థల అధికారులు ఒక కమిటీగా ఏర్పడి నీటి ఎద్దడిని పరిశీలించి సమస్యను పూర్తిగా పరిష్కరించాలని సూచించారు. నగరంలో వర్షపు నీటిని నిల్వ చేసేందుకు భారీ సామర్థ్యంతో ట్యాంకులు నిర్మిస్తున్నామని తెలిపారు. ఇందులో ఇప్పటికే మూడు ట్యాంకుల నిర్మాణం పురోగతిలో ఉందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని విపత్తు నిర్వహణ విభాగం మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. సైబరాబాద్లోని రద్దీ ప్రాంతాల్లో వాహనాలు రోడ్లపై చెడిపోతే వాటిని వెంటనే తొలగించేందుకు అదనపు క్రేన్లను సమకూర్చాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు కురిస్తే సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో 630 మాన్ సూన్ సపోర్టు టీమ్ లను అందుబాటులో ఉంచినట్లు దానకిషోర్ తెలిపారు.
India vs Pakistan: భారత్- పాక్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్.. ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్..?
తాజావార్తలు
-
RCB Fans: కప్ గెలిచిన ఆనందం కొన్ని క్షణాలు కూడా లేకపాయే.. ఆర్సీబీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్..
-
Virat Kohli: నన్ను త్వరగా అవుట్ చేయాలని అందరూ చూస్తారు.. ఏం పర్లేదు, నా ప్లాన్స్ నాకుంటాయి!
-
Romantic Drama : తాగుబోతు ప్రేమకు ఇంత డిమాండా? ఐయండిబిలో 8.7 రేటింగ్
-
America vs Iran: కాస్కో ఇరాన్..! మీకు రెండే ఆప్షన్స్.. వినకపోతే లేపి పడేస్తాం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
-
Dell XPS 13 (2026): డెల్ XPS 13 ల్యాప్టాప్ విడుదల.. 32GB RAM, 2.5K టచ్స్క్రీన్తో ఆకట్టుకుంటున్న కొత్త మోడల్
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!