Telangana Floods : భయానక వర్షాలు.. చరిత్రలో కనీవినీ ఎరుగని వరదలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో గోదావరే వరద నీటితో మునిగిపోవడంతో ఉత్తర తెలంగాణలోని గ్రామాలు, పట్టణాలతో పాటు సాగునీటి ప్రాజెక్ట్ లు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ప్రాజెక్ట్ ల నుంచి గ్రామాలు, పట్టణాలకు తాగు, సాగు నీరు అందే పరిస్థితి నుంచి అందుకు విరుద్ధంగా ఉత్తర తెలంగాణలోని ప్రతీ నేలా వరద పరవల్లతో పొంగుతుండడంతో పాటు ఎగువ నుంచి గోదావరికి వస్తున్న వరద తోడు కావడంతో ఊళ్లు, భూములు, దేవాలయాలు, ప్రాజెక్ట్ లు సర్వం నీటిలో తేలాడుతున్నాయి. 1986 లో మేడిగడ్డ (కాళేశ్వరం) ప్రాంతంలో రికార్డు అయిన (సిడబ్లూసి గేజింగ్) భారీ వరదను మించి గోదావరి ప్రవహిస్తుండడంతో పాటు అదిలాబాద్, నిజమాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాలతో పాటు మహారాష్ర్ట, ఛత్తీస్ఘడ్ నుంచి వస్తున్న వరద నీటికి మొత్తం ఉత్తర తెలంగాణ అతలాకుతలం అయిపోయింది. 14 వ తేది మధ్యాహ్నం నాటికి మేడిగడ్డ వద్ద వరద ప్రవాహాం 25 లక్షల క్యుసెక్కులు దాటింది. బ్యారేజ్ గరిష్ట ఎత్తు 108 మీటర్లు కాగా ఎఫ్ ఆర్ ఎల్ (పూర్తి స్థాయి నీటి మట్టం) వందల అడుగులుగా నిర్మించారు. అయితే ప్రస్తుతం 102 మీటర్ల మేర నీరు ప్రవహిస్తుండడంతో స్పిల్ వే పిల్లర్లు సైతం మునగిపోయాయి. దీనికి తోడు ప్రాణహిత, పెన్ గంగ, వార్ధ లాంటి ఉపనదుల నుంచి భారీగా వరద వస్తోంది.
సాధారణంగా ప్రాణహిత నుంచి మాత్రమే వరద వస్తుంది. ఎప్పుడో కానీ వార్ధ, పెనుగంగ ల నుంచి వరద రాదు. కానీ గోదావరికి సంబంధించిన అన్ని ఉపనదుల నుంచి వరద వస్తుండడంతో మహారాష్ర్ట, ఛత్తీస్ ఘడ్, తెలంగాణ ప్రాంతాల్లోని పట్టణాలు, పల్లెలు వరదమయమయ్యాయి. దీని ప్రభావంతో కాళేశ్వరం దేవాలయంలోకి నీరు ప్రవేశించింది. ప్రాజెక్ట్ భద్రత కోసం ఏర్పాటు చేసిన కార్యాలయం, వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు నీటిలో మునగిపోయాయి. ఓ వైపు వరద నీటితో నీటి మట్టం పెరగడంతో పాటు ఇంకో వైపు మిడ్ మానేరు, శ్రీరాం సాగర్, కడెం నారాయణరెడ్డి, శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి తదితర ప్రాజెక్ట్ ల నుంచి వరద నీరు విడుదలవుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో ఊరువాడ-గొడ్డు- గోదాం, ప్రాజెక్ట్ లు- పాఠశాలలు, దేవాలయాలు- ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ నీట మునిగిపోయాయి.
Also Read
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
గురువారం మధ్యాహ్నం నాటికి గోదావరి బేసిన్ లోని అన్ని ప్రాజెక్ట్ లు వరద నీటితో కొట్టుకుపోయేలా వణికిపోతున్నాయి. శ్రీరాం సాగర్, మిడ్ మానేరు, లోయర్ మానేరు, ఎస్సారెస్పీ వరద కాలువ, కడెం ప్రాజెక్ట్, ఎల్లంపల్లి బ్యారేజ్ మొదలైన ప్రాజెక్ట్ ల నుంచి పూర్తి స్థాయిలో నీరు విడుదల చేస్తున్నా అంతే స్థాయిలో వరద వస్తోంది. ఎల్లంపల్లి నుంచి 11 లక్షల 79 వేల క్యూసెక్కుల ఇన్ ఫో సరాసరిన వస్తుంటే 11 లక్షల 85 వేల క్యుసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు. శ్రీ రాం సాగర్ నుంచి 3 లక్షల 29 వేల క్యుస్కెల నీటిని విడుదల చేస్తున్నారు. కేంద్ర జల సంఘం హెచ్చరికల ప్రకారం ఎప్పుడూ వరద రాని వార్ధ ఉప నదికి గరిష్టస్థాయిలో వరద నీరు వస్తోంది. 162 మీటర్ల గరిష్ట ప్రమాద నీటి మట్టాన్ని దాటి ప్రవహిస్తోంది. దీనివల్ల మహారాష్ర్టలోని చంద్రాపూర్ జిల్లాలో వరద విలయ తాండవం చేస్తోంది. అలాగే పెన్ గంగ లో వరద నీరు 97 మీటర్లు గరిష్టం కాగా 103 మీటర్లు దాటి పోయింది. దీని వల్ల యావత్మాల్ జిల్లాలో ముంపునకు గురవుతోంది. అదే విధంగా అదిలాబాద్, మంచిర్యాల జిల్లాలో గరిష్ట స్థాయిలో వరద నీరు ప్రవాహం 138 మీటర్లు కాగా ఆ స్థాయి ని మంచి ప్రవహిస్తోంది. ఈ విధమైన పరిస్థితి వల్ల ప్రాజెక్ట్ లు నీటి మునిగిపోయి అతలాకుతలం అవుతున్నాయి.
తాజావార్తలు
-
Rajasthan: రాజస్థాన్లో ఇసుక తుఫాన్ బీభత్సం.. బెంబేలెత్తిపోయిన ప్రజలు
-
Crime Comedy Movie : మనుషులను బురిడీ కొట్టించే గొర్రెల మంద… హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్న క్రైమ్ కామెడీ
-
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ 2.0కు సిద్ధం.. పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి భారీ శుభవార్త చెప్పిన బీసీసీఐ.. ఎట్టకేలకు లిస్ట్లో పేరు..
-
IT to Auto-driver: ఐటీ ఉద్యోగం వదిలి ఆటోడ్రైవర్గా మారి.. ఒక మహిళ కథ వైరల్..
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..