ఫాంహౌస్ లో పేకాట స్థావరం ఏర్పాటు చేసిన గుత్తా సుమన్ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. ఆదివారం రాత్రి 30 మంది నీ అరెస్ట్ చేసారు పోలీసులు. తవ్వే కొద్ది గుత్తా సుమన్ ఆగడాలు బయట పడుతున్నాయి. విదేశీ క్యాసినో నిర్వాహకులతో పరిచయాలు ఉన్నట్లు తెలుస్తుంది. పేకాట ఈవెంట్ కోసం ప్రత్యేక ఆహ్వాన పత్రికలు ఇచ్చినట్లు సమాచారం. మద్యం సరఫరా, అమ్మాయిల సహాయం తో ఈవెంట్ నిర్వహణ… ఒక సిట్టింగ్ కు 25 వేలు రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక నగరంలో నీ హోటళ్ళు, రెస్టారెంట్ల అద్దెకు తీసుకుని స్థావరం ఏర్పాట్లు చేసారు. రెస్టారెంట్ లలో క్యాసినో నిర్వహణ చేస్తున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన మిగిలిన 29 మందికి బెయిల్ మంజూరు చేసిన ఉప్పర్ పల్లి కోర్ట్.. గుత్తా సుమన్ ను పోలీస్ కస్తడికి అనుమతి ఇచ్చింది కోర్ట్. దాంతో గుత్తా సుమన్ ను చర్లపల్లి జైల్ నుండి కస్టడీ కి తీసుకున్నారు పోలీసులు.
ఫాంహౌస్ పేకాట కేసులో బిగుస్తున్న ఉచ్చు…
