Warangal Market: ఏనుమాముల మార్కెట్కు ఐదు రోజులు సెలవు.. ఆందోళనలో రైతులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warangal Market: అసలే పండగ సీజన్ వున్న పంటను అమ్ముకుని వచ్చిన డబ్బుతో పండుగను జరుపుకునే ఆనందంలో వున్న రైతులకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పటికే నీరు లేక పంటలు ఎండిపోవడం, అకాల వర్షాలకు చేతి కొచ్చిన పంట నేలరాలడం జరిగి రైతుల కంట కన్నీరు వస్తుంది. వీటన్నింటిని తట్టుకుని వచ్చిన పంటను అమ్ముకుంటే పండగకు అయినా వచ్చిన డబ్బుతో కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుదామనుకునే రైతులకు చివరకు నిరాసేమిగింది. ఎప్పుడూ.. పండుగ సీజన్ ల్లో.. రైతులు, వారు తెచ్చిన పంటలతో నిండుగా ఉండే వరంగల్ జిల్లా ఏనుమాముల మార్కెట్ ఇప్పుడు ఖాళీగా కనిపించనుంది.
Read also: Apple Layoff 2024: యాపిల్లో భారీగా ఉద్యోగాల కోత!
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా.. ఐదు రోజులు ఏనుమాముల మార్కెట్ బంద్ కానుంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు నష్టాలు, మరో వైపు మార్కెట్లకు సెలవులు ప్రకటించడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేడు (శుక్రవారం) బాబు జగ్జీవన్రాం జయంతి ఉండగా, శని, ఆదివారాలు మార్కెట్కు వారాంతపు సెలవులు కాగా.. అలాగే )సోమవారం) అమావాస్య, మంగళవారం ఉగాది సందర్భంగా ఏనుమాముల మార్కెట్ కు అధికారులు సెలవు ప్రకటించారు. అనగా.. శుక్రవారం నుంచి మంగళవారం వరకు రైతులు ఉత్పత్తులను మార్కెట్కు తీసుకురావద్దని ఆఫీసర్లు సూచించారు. 10వ తేదీ బుధవారం మార్కెట్ పునఃప్రారంభం అవుతుందని తెలిపారు.
Read also: Uber Auto Charges: వామ్మో.. మరోసారి ఆటో చార్జికి ‘కోట్లు’ అడుగుతున్న ఉబర్..!
అంతే కాకుండా.. ఈ నెల 11,12, రంజాన్ పండుగ, 13, 14న శని, ఆదివారాలు వారాంతపు బంద్ అని మార్కె ట్ అధికారులు తెలిపారు. మొత్తం 9రోజులు మార్కెట్కు సెలవులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే దీనిపై ప్రభుత్వం పట్టించుకోవాలని రైతులు కోరుతున్నారు. ఉగాది పండుగ రానున్న సందర్భంగా.. ఎలా బతకాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి రైతుల గురించి ఆలోచించాలని, ఏనుమాముల మార్కెట్ ను ఐదు రోజులు సెలవు ప్రకటిస్తే.. తీసుకువచ్చిన పంటను ఐదు రోజులు ఎలా పెట్టాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. తీసుకొచ్చిన పంటను అమ్మకునే విధంగా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం ఎలా స్పందించనుందో వేచి చూడాలి.
Apple Layoff 2024: యాపిల్లో భారీగా ఉద్యోగాల కోత!
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?