Warangal Market: ఏనుమాముల మార్కెట్కు ఐదు రోజులు సెలవు.. ఆందోళనలో రైతులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warangal Market: అసలే పండగ సీజన్ వున్న పంటను అమ్ముకుని వచ్చిన డబ్బుతో పండుగను జరుపుకునే ఆనందంలో వున్న రైతులకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పటికే నీరు లేక పంటలు ఎండిపోవడం, అకాల వర్షాలకు చేతి కొచ్చిన పంట నేలరాలడం జరిగి రైతుల కంట కన్నీరు వస్తుంది. వీటన్నింటిని తట్టుకుని వచ్చిన పంటను అమ్ముకుంటే పండగకు అయినా వచ్చిన డబ్బుతో కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుదామనుకునే రైతులకు చివరకు నిరాసేమిగింది. ఎప్పుడూ.. పండుగ సీజన్ ల్లో.. రైతులు, వారు తెచ్చిన పంటలతో నిండుగా ఉండే వరంగల్ జిల్లా ఏనుమాముల మార్కెట్ ఇప్పుడు ఖాళీగా కనిపించనుంది.
Read also: Apple Layoff 2024: యాపిల్లో భారీగా ఉద్యోగాల కోత!
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా.. ఐదు రోజులు ఏనుమాముల మార్కెట్ బంద్ కానుంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు నష్టాలు, మరో వైపు మార్కెట్లకు సెలవులు ప్రకటించడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేడు (శుక్రవారం) బాబు జగ్జీవన్రాం జయంతి ఉండగా, శని, ఆదివారాలు మార్కెట్కు వారాంతపు సెలవులు కాగా.. అలాగే )సోమవారం) అమావాస్య, మంగళవారం ఉగాది సందర్భంగా ఏనుమాముల మార్కెట్ కు అధికారులు సెలవు ప్రకటించారు. అనగా.. శుక్రవారం నుంచి మంగళవారం వరకు రైతులు ఉత్పత్తులను మార్కెట్కు తీసుకురావద్దని ఆఫీసర్లు సూచించారు. 10వ తేదీ బుధవారం మార్కెట్ పునఃప్రారంభం అవుతుందని తెలిపారు.
Read also: Uber Auto Charges: వామ్మో.. మరోసారి ఆటో చార్జికి ‘కోట్లు’ అడుగుతున్న ఉబర్..!
అంతే కాకుండా.. ఈ నెల 11,12, రంజాన్ పండుగ, 13, 14న శని, ఆదివారాలు వారాంతపు బంద్ అని మార్కె ట్ అధికారులు తెలిపారు. మొత్తం 9రోజులు మార్కెట్కు సెలవులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే దీనిపై ప్రభుత్వం పట్టించుకోవాలని రైతులు కోరుతున్నారు. ఉగాది పండుగ రానున్న సందర్భంగా.. ఎలా బతకాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి రైతుల గురించి ఆలోచించాలని, ఏనుమాముల మార్కెట్ ను ఐదు రోజులు సెలవు ప్రకటిస్తే.. తీసుకువచ్చిన పంటను ఐదు రోజులు ఎలా పెట్టాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. తీసుకొచ్చిన పంటను అమ్మకునే విధంగా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం ఎలా స్పందించనుందో వేచి చూడాలి.
Apple Layoff 2024: యాపిల్లో భారీగా ఉద్యోగాల కోత!
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!