Site icon NTV Telugu

Etela Rajender: ప్రాణహిత-చేవెళ్లకు అడ్డుపడింది కేసీఆరే..!

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు అడ్డుపడింది కేసీఆరేనని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌.. వికారాబాద్ జిల్లా తాండూర్‌లో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల శిక్షణా తరగతుల్లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. మద్యం, డబ్బులు ఎన్ని కురిపించినా ప్రజల గుండెల్లో నిలిచి ఉన్న వ్యక్తికి విజయం ఖాయని తెలిపారు.. రాష్ట్రంలో కేసీఆర్‌ అంటే అసహ్యించు కొంటున్న వారు నాకంటే ఎక్కువగా మీకు తెలుసని సెటైర్లు వేసిన ఆయన.. కాంగ్రెస్ కు ఓటు వేస్తే టీఆర్ఎస్ ఓటు వేసినట్లే అని ఆరోపించారు.

Read Also: LIVE : వాస్తుకర్తరి సమయంలో తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు

ఆత్మ గౌరవం, ధర్మం మాత్రమే ప్రజల హృదయాల్లో స్థానం ఉంటుందన్నారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఇక, రైతుబంధు పేద రైతులకు మాత్రమే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మన జీవితంలో వెలుగులు నింపాలని అంటే బీజేపీ జెండాను ఎగుర వేయాల్సిందేనని పిలుపునిచ్చారు. ఇక, సెల్ఫోన్ ఒక ఏకే-47 లాంటిది.. దాని ద్వారా ప్రజలకు మంచి చేసే సందేశాలు పంపించానలి బీజేపీ మండల శిక్షా శిబిరానికి హాజరైన కార్యకర్తలకు సూచించారు ఈటెల రాజేందర్.

Exit mobile version