Site icon NTV Telugu

Etela Rajender : హుజూరాబాద్ ఎన్నికల తరువాత సీఎం కేసీఆర్ మతి తప్పింది

తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ చేపట్టిన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర నేడు 8వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో జోగులాంబ గద్వాల్‌ జిల్లాలో బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. హుజూరాబాద్ ఎన్నికల తరువాత సీఎం కేసీఆర్ మతి తప్పిందని ఆయన విమర్శించారు. హుజూరాబాద్ లో ధర్మం గెలిచిందని, హుజూరాబాద్ లో ప్రజాస్వామ్యం,తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గెలిచిందని ఆయన అన్నారు. ఆకలి కేకలు లేని, ఆత్మహత్యలు లేని తెలంగాణ వస్తాదనీ చెప్పినా కేసీఆర్.. కేసీఆర్ వచ్చినా తరువాత నీళ్ళు రాని మాట సత్యం కాదా? నేను సవాల్ విసురుతున్నా…ఎక్కడైనా చర్చకు సిద్ధం..వస్తారా కేసీఆర్? రైతబంధు ఇచ్చేది పంటలు వేయమానా?..వేయద్దానా సమాధానం చెప్పగలవా కేసీఆర్? వేలాది మంది రైతులు చనిపోతున్నారు..ఈ పరిస్థితి ఎక్కడ లేదు..ఓన్లీ తెలంగాణలోనే ఉంది.. సమధానం చెప్తారా? అని ఆయన ప్రశ్నించారు. రైతుల కన్నీళ్ళకు కేసీఆర్ ప్రభుత్వం భస్మమవుతుందని, రాబోయే కాలంలో టీఆర్ఎస్ పార్టీ పాతరయేపడుతుంది కాబట్టి కేటీఆర్ అలా మాట్లాడుతున్నాడని ఆయన మండిపడ్డారు. రానున్న రోజులలో గెలిచే పార్టీ బీజేపీనేని, అడ్డుకునే శక్తి కేసీఆర్ కు, కేసీఆర్ జేజేమ్మకు లేదని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version