Site icon NTV Telugu

మంత్రి హరీష్ రావుపై ఈటల ఫైర్‌..

హుజురాబాద్‌లో ప్రచారంలో బిజీగా ఉన్న మాజీ మంత్రి ఈటల మంత్రి హరీష్‌ రావుపై విరుచుకుపడ్డారు. హుజురాబాద్‌ మందిని మంత్రి హరీష్ రావు తీసుకు పోయి… దావత్, డబ్బులు ఇవ్వాలని… ఇదే పని ఆయనది అని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌ మెప్పు పొందాలనే ఇలా మంత్రి హరీష్ రావు చేస్తున్నాడని ఫైర్‌ అయిన ఈటల..హరీష్‌ కు కూడా తన గతే పడుతుందన్నారు. హుజూరాబాద్ చైతన్యవంతమైనా గడ్డ అని పేర్కొన్న ఈటల… ప్రాణాన్ని లెక్కచేయకుండా పోరాటం చేసిన గడ్డ హుజురాబాద్ అని స్పష్టం చేశారు.

read also : కీసర రిజర్వు ఫారెస్ట్ లో మొక్కలు నాటిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్

మంత్రులకు, ఎమ్మెల్యేలకు స్క్రిప్ట్ రాసి పంపించి మాట్లాడిపిస్తున్నారని మండిపడ్డారు. ఇతర పార్టీల నుండి ఎమ్మెల్యేలను తీసుకవచ్చి మంత్రులను చేసిన ఘనతే కేసిఆర్ దేనని..నీ పార్టీలో గెలిచిన అన్నారుగా…అందుకే రాజీనామా చేసి వచ్చానని పేర్కొన్నారు. బానిసగా బ్రతికినా చరిత్ర, బ్రతికే చరిత్ర మాకు లేదని…డబ్బును, ప్రలోభాలను పాతరవేసే సత్తా హుజురాబాద్ ప్రజలకు ఉందన్నారు. ఈ దేశాన్ని పాలిస్తున్న పార్టీ…బీజేపీ పార్టీ అని పేర్కొన్నారు. తాను వరంగల్ మున్సిపల్ ఎలక్షన్స్ ప్రచారంలో ఉండగానే….కేసీఆర్ కుట్రలు చేశాడని… వాళ్ళ అబద్ధాల పత్రిక, అబద్దాల ఛానల్ లో పదే పదే అబద్ధాలు చెప్పారని ఫైర్‌ అయ్యారు.

Exit mobile version