Nama Nageswara Rao: ఎంపీ నామా నాగేశ్వరరావుకి ఈడీ షాక్.. ఆస్తులు జప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Enforcement Department Gives Shock To Nama Nageswara Rao: టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ (ఈడీ) షాకిచ్చింది. రుణాల పేరిట మోసం చేసిన కేసులో ఆయన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. నామా నాగేశ్వరరావు కుటుంబానికి చెందిన రూ. 80.65 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. జూబ్లీహిల్స్లోని మధుకాన్ గ్రూప్ ప్రధాన కార్యాలయాన్ని అటాచ్ చేసిన ఈడీ.. హైదరాబాద్, ఖమ్మం, ప్రకాశం జిల్లాల్లోని 28 స్థిరాస్తులను సైతం అటాచ్ చేసింది. గతంలోనూ రూ. 73.74 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. రాంచీ ఎక్స్ప్రెస్ హైవే పేరిట రుణాలు తీసుకొని, వాటిని మళ్లించారని ఈడీ పేర్కొంది. సుమారు రూ. 361.92 కోట్లు నేరుగా మళ్లించినట్లు గుర్తించామన్నారు. నామా నాగేశ్వరరావు, నామా సీతయ్య ఆధీనంలో ఆరు డొల్ల కంపెనీలు ఉన్నట్లు ఈడీ వెల్లడించింది.
కాగా.. నామా నాగేశ్వరరావుకు సంబంధించిన మధుకాన్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అనే సంస్థ.. 2011లో జార్ఖండ్లోని రాంచీ నుంచి జంషెడ్పూర్ వరకు 163 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారి నిర్మించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) నుంచి కాంట్రాక్టు తీసుకుంది. ఈ రహదారి నిర్మాణం కోసం కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్షియం నుంచి రూ. 1,030 కోట్ల రుణం పొందింది. మొదట్లో రహదారి పనుల్ని వేగవంతం చేశారు కానీ, ఆ తర్వాత చేతులెత్తేశారు. నిర్ణీత సమయంలో రోడ్డు నిర్మాణం పూర్తి చేయకుండా.. 50.24 శాతం మాత్రమే చేశారు. ఈ విషయంపై సీబీఐకి ఫిర్యాదు చేసిన ఎన్హెచ్ఏఐ.. ఈ రోడ్డు నిర్మాణం కోసం 90 శాతం రుణం పొంది, నిర్మాణ పనులు ఆ సంస్థ ఆపేసిందని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో.. 2019లో సీబీఐ కేసు నమోదు చేసి, విరాచణ చేపట్టింది. ఇందులో భాగంగానే తాజాగా ఈడీ నామా నాగేశ్వరరావు ఆస్తుల్ని జప్తు చేసింది.
Also Read
తాజావార్తలు
-
TGTET ఇన్సర్వీస్ కీ విడుదల.. అభ్యంతరాలకు ఇదే చివరి ఛాన్స్.!
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
-
Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
-
Tarique Rahman: బ్రిక్స్కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?