Endela Lakshminarayana: కేంద్ర నిధులతో చేపట్టే పనులకు.. టీఆర్ఎస్ రంగులు వేసుకుంటోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Endela Lakshminarayana Comments On CM KCR: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా మోడీ 20 ఏళ్ల పాలనపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ఆయన.. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కేంద్రం ఇస్తోన్న నిధులతోనే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అన్నారు. కానీ.. ఆ పనులన్నీ తామే చేస్టున్నట్టుగా టీఆర్ఎస్ ప్రభుత్వం రంగులు వేసుకుంటోందని వ్యాఖ్యానించారు. కెసిఆర్ రైతు బందు పథకం పెట్టకముందు రైతులకు ఎన్నో సబ్సిడీలు ఉండేవని, కానీ ఇప్పుడు వాటిని బంద్ చేశారని ఆరోపించారు. రైతు బందు ఇస్తానని హామీ ఇచ్చి, దళితుల్ని మోసం చేశారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేవలం దళితుల ఓటు బ్యాంక్ను తమ ఖాతాలో వేసుకునేందుకు, కేసీఆర్ ఆ పథకాన్ని తీసుకొచ్చారని పేర్కొన్నారు.
ఇక వడ్లు కొనేది కేసీఆర్ కాదు.. ఎఫ్సీఐ (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) అని యెండల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చే కమిషన్లతోనే కొనుగోలు కేంద్రాలు నడుసతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నప్పటికీ.. కొత్తపల్లి మనోహరబాద్ రైల్వే లైన్ పనులు నత్త నడకన నడుస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఇతర ప్రాజెక్టులకు కూడా కేంద్రం నిధులు జారీ చేసిందని.. కానీ టీఆర్ఎస్ నేతలు నిధులు ఇవ్వడం లేదని అబద్ధాలు చెప్తున్నారని చెప్పారు. చివరికి.. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ని కూడా కేంద్రం సహకారంతోనే కేసీఆర్ ఇస్తున్నాడని తెలిపారు. కానీ, తామే అందిస్తున్నట్టుగా టీఆర్ఎప్ప గొప్పలకు పోతోందన్నారు. ఇదే సమయంలో మంత్రి హరీశ్ రావుపై కౌంటర్ వేశారు. నేతి బీరకాయలో నేతి లేనట్లు.. మంత్రి హరీష్ రావుకి నీతి లేదని యెండల లక్ష్మీనారాయణ కామెంట్స్ చేశారు.
Also Read
తాజావార్తలు
-
CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
-
Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
-
Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
-
CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
-
Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!