Site icon NTV Telugu

HYD ED Raids: హైద్రాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు.. రంగంలోకి 15 బృందాలు

Ed Raids

Ed Raids

HYD ED Raids: హైదరాబాద్ లో మరోసారి ఈడీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇవాళ ఉదయం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. 15 బృందాలు రంగంలోకి దిగి ఏకకాలంలో వివిధ కంపెనీలు, యజమానుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నాయి. పంజాగుట్ట, మణికొండ, జూబ్లీహిల్స్‌లోని పలు ఇళ్లు, సంస్థల్లో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. వ్యాపారవేత్త మలినేని సాంబశివరావు ఇళ్లు, సంస్థలపై ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. ట్రాన్స్ ట్రై రోడ్స్, టెక్నో యూనిట్ ఇన్ ఫ్రా టెక్, కాకతీయ క్రిస్టల్ పవర్ లిమిటెడ్, ట్రాన్స్ ట్రై పవర్ ప్రాజెక్ట్ కంపెనీలకు ఆయన డైరెక్టర్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన డైరెక్టర్‌గా ఉన్న కంపెనీలు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకుండా ఎగవేసినట్లు ఈడీ గుర్తించింది.

Read also: Whatsapp Settings: ఇలా చేయండి.. ఫేక్ కాల్స్, మెసెజెస్‌కు చెక్ పెట్టండి

అందులో భాగంగానే ఈడీ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాంకు ఖాతాలు, కంపెనీలకు సంబంధించిన పలు పత్రాలను పరిశీలిస్తున్నారు. రుణాలు ఎగ్గొట్టారనే ఆరోపణలపై సిబ్బందిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. నర్సరావుపేటకు చెందిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇళ్లు, సంస్థలపై కూడా సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గుంటూరులోని ఆయన ఇళ్లపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రాయపాటి సాంబశివరావు హైదరాబాద్‌లోని తన ఇంట్లోనే ఉంటున్నారు. రాయపాటి కుమారుడు రంగారావును ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రాయపాటి కంపెనీలు రూ. వివిధ బ్యాంకుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి వాటిని చెల్లించలేదు. దీంతో ఈడీ గతంలో రాయపాటి సాంబశివరావుపై కూడా కేసు నమోదు చేసింది. అతని కంపెనీల్లో మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ గుర్తించింది.

Whatsapp Settings: ఇలా చేయండి.. ఫేక్ కాల్స్, మెసెజెస్‌కు చెక్ పెట్టండి

Exit mobile version