రేపటి నుండి తెలంగాణ ఎంసెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఎన్టీవీ తో ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ మాట్లాడుతూ… గత ఏడాది కన్నా 28 వేల మంది ఎక్కువ దరఖాస్తు చేసుకున్నారు. ఏపీ నుండి 50 వేల మంది పరీక్షలకు హాజరుకానున్నారు. కోవిడ్ బారిన పడ్డ విద్యార్థులకి అన్ని సెట్స్ అయ్యిపోయాక పరీక్ష నిర్వస్తాము. ఇప్పటి వరకు ఒకటి రెండు ఫిర్యాదులు మాత్రమే వచ్చాయి.
ఇక ఒక్క నిమిషం ఆలస్యం అయిన పరీక్ష సెంటర్ లోకి నో ఎంట్రీ అని తెలిపారు. విద్యార్ధులు మాస్కు లు ధరించి రావాలి. సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. విద్యార్థులు పరీక్ష సమయం కన్నా రెండు గంటల ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. 4,5,6 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ మొత్తం 6 సెషన్స్ లలో… 9,10 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ 3 సెషన్స్ లలో జరగనున్నాయి. ఉదయం 9 నుండి 12 వరకు, మధ్యాహ్నం 3 నుండి 6 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఎంసెట్ కి దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 2 లక్షల 51 వేల 606 కాగా ఇందులో ఇంజనీరింగ్ స్ట్రీమ్ లక్ష 64 వేల 962 .. అగ్రి, మెడికల్ స్ట్రీమ్ 86 వేల 644 మంది విద్యార్థులు ఉన్నారు.
అయితే మొత్తం 105 పరీక్ష కేంద్రాలు ఉండగా తెలంగాణ లో 82, ఆంధ్ర లో 23 ఉన్నాయి. విద్యార్థులు పెరిగిన నేపథ్యంలో సెంటర్లు, సెషన్స్ పెంచాం అని తెలిపారు. ఇంటర్ వెయిటేజ్ లేదు…ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి సిలబస్, ద్వితీయ సంవత్సరం 70 శాతం సిలబస్ నుండే ప్రశ్నలు వస్తాయి. బిట్ సాట్ రాస్తున్న 1500 మంది విద్యార్థులు పరీక్ష టైమ్ ని రి షెడ్యూల్ చేశాము. పరీక్ష తర్వాత 15 రోజుల్లో ఫలితాలు విడుదల అవుతాయి. ఇంగ్లీష్ మీడియం లో రాసే విద్యార్థులకు కేవలం ఇంగ్లీషు లోనే ప్రశ్నలు వస్తాయి అని పేర్కొన్నారు.
