Dr K Laxman: చేతి వృత్తులు ద్వారా సంపద సృష్టించే కొత్త కార్యక్రమం ఇది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dr K Laxman: చేతి వృత్తులు ద్వారా సంపద సృష్టించే కొత్త కార్యక్రమం ఇది అని డా.లక్ష్మణ్ అన్నారు. సుందరయ్య పార్క్ నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు ధన్యవాదాలు మోడీ పేరుతో నిర్వహించిన బైక్ ర్యాలీలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట Dr లక్ష్మణ్, కిషన్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి లు కలిసి మోడీ కటౌట్ కి నిలువెత్తు పాలాభిషేకం చేశారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 18 వర్గాల ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ దీర్ఘాయుష్షు కోసం నిర్వహించిన విశ్వకర్మ యజ్ఞంలో పాల్గొన్నారు. అత్యంత వెనకబడ్డ సంప్రదాయ, హస్త కళాకారులు ప్రధాని విశ్వకర్మ వికాస్ యోజన రేపు మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానుందని అన్నారు. చిన్న కులాల, వృత్తులు వారి కోసం శిక్షణ, పనిముట్లు, లోన్లు ఇచ్చే గొప్ప కార్యక్రమం పెట్టిన ఘనత మోడీది అన్నారు. 18 రకాల వృత్తులు మీద ఆధారపడిన వారికి ఉపయోగ పడే సంక్షేమ కార్యక్రమం ఇది తెలిపారు. చేతి వృత్తులు ద్వారా సంపద సృష్టించే కొత్త కార్యక్రమం ఇది అన్నారు. దేశ వ్యాప్తంగా రేపు 70 మంది కేంద్ర మంత్రులు వివిధ స్థలాల్లో పాల్గొంటారని వెల్లడించారు. 750 జిల్లా కేంద్రాల్లో రేపు OBC మోర్చా తరపున ధన్యవాదాలు, మోడీ కార్యక్రమం పేరుతో బైక్ ర్యాలీ, పాలాభిషేకం కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు.
Also Read
- AIDWA: రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల సరుకులు ఇవ్వాల్సిందే.. ఐద్వా డిమాండ్
- Ponguleti Srinivas Reddy : గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో చేసిందేమీ లేదు
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
రేపు తెలంగాణ విమోచనం కాబట్టి తెలంగాణలో బీజేపీ కార్యాలయంలో మోడీ దీర్ఘాయుష్షు కోసం విశ్వకర్మ యజ్ఞం చేసామని, అన్నీ అసెంబ్లీ కేంద్రాల్లో ర్యాలీలు చేశామని వెల్లడించారు. రేపు అన్ని జిల్లాల్లో obc, బీజేపీ తరపున ప్రత్యక్ష కార్యక్రమాలు ఏర్పాటు జరిగిందన్నారు. దేశంలో 30 లక్షల కుటుంబాలకు, తెలంగాణ, ఆంధ్రా లో నాలుగున్నర లక్షల కుటుంబాలకు ఉపయోగ పడుతుందని అన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకే కానీ ఇది ప్రజలకోసం చేసి పని అన్నారు. బీసీలకు 34 శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఉంటే పెంచాల్సింది పోయి.. 22 శాతం తగ్గించి బీసీ లను మోసం చేసిందన్నారు. మహిళా రిజర్వేషన్ పేరుతో కొత్త డ్రామా కేసీఆర్ మొదలు పెట్టిండని అన్నారు. కవితమ్మ మీ పార్టీ లో మహిళా, బీసీ, ఎస్సీ, ఎస్టీ ల స్థానం ఏంటిది? అని ప్రశ్నించారు. కేంద్రంలో 11 మంది మహిళా మంత్రులు, 8 మంది మహిళా గవర్నర్లు ఉన్నారని అన్నారు. ఈ తీర్మానాలను నమ్మి మోసపోయే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరని అన్నారు. ఎంబీసీ అన్నావ్ ఏమయ్యింది? 119 లో ఎన్ని బీసీ లకు, ఎన్ని మహిళలకు ఇచ్చావ్ కేసీఆర్ అది చెప్పు? అని ప్రశ్నించారు. కేసీఆర్ మాయమాటలకు మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
IAS officer: మహిళా IAS అధికారికి వేధింపులు.. స్వీట్ బాక్స్తో డెరెక్టుగా ఇంటికి వెళ్లిన వ్యక్తి
తాజావార్తలు
-
పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
-
AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
-
Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!