Site icon NTV Telugu

Telangana Budget: నేటితో బడ్డెట్‌ పద్దులపై శాసనసభలో ముగియనున్న చర్చ

Telangana Assembly

Telangana Assembly

Telangana Budget: రాష్ట్ర బడ్జెట్‌పై శాసనసభలో నేటితో చర్చ ముగియనుంది. గత రెండు రోజుల్లో 24 అంశాలపై చర్చించి ఆమోదించారు. మూడో రోజైన నేడు మిగిలిన 13 అంశాలపై చర్చ జరగనుంది. నీటిపారుదల, సాధారణ పరిపాలన, వాణిజ్య పన్నులు, వైద్య ఆరోగ్యం, ఆర్థిక, పశుసంవర్ధక, గృహ, వ్యవసాయం, సహకారం, పంచాయతీరాజ్, రవాణా శాఖ, గవర్నర్-మంత్రి మండలిపై చర్చించనున్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులపై కూడా అసెంబ్లీలో చర్చ జరగనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 18,257 కోట్ల అనుబంధ వ్యయ అంచనాలను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సభలో ప్రవేశపెట్టనున్నారు. చేపల ఉత్పత్తి, ఎస్ ఆర్ డీపీ, మెట్రో రైలు పొడిగింపు, చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు, పాల ఉత్పత్తి, నీరా కేఫ్, చెక్ డ్యామ్ ల నిర్మాణం, క్రీడా మైదానాలు, ఫీజు రీయింబర్స్ మెంట్ తదితర అంశాలపై ప్రశ్నోత్తరాల సమయంలో చర్చిస్తారు.రెండు రోజుల పాటు 24 అంశాలపై చర్చించి ఆమోదించారు. ఈరోజు మరికొన్ని అంశాలపై చర్చించనున్నారు. శుక్రవారం జరిగిన సమావేశంలో బంజరు భూములు, వైద్య కళాశాలలు, ఐటీ, చేనేత, కార్మిక రంగాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానమిచ్చారు.

Read also: Revanth Reddy: తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండి

నిన్న శుక్రవారం బడ్జెట్‌పై చర్చ సందర్భంగా పోడు భూములు, వైద్య కళాశాలలు, ఐటీ, చేనేత రంగాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ సమాధానాలు చెప్పడంతో శాసనసభ దద్దరిల్లింది. రాష్ట్రంలో పోడు భూముల సమస్యకు స్వస్తి పలకాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 11.5 లక్షల ఎకరాల భూములు బీడుగా ఉన్నాయని, ఈ నెలాఖరులోగా ఎమ్మెల్యేల సమక్షంలో గిరిజనులకు భూములు పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఇకపై అటవీ భూములను ఆక్రమించబోమని ఆయా గిరిజనుల నుంచి గ్రామ సర్పంచి, ఎంపీటీసీలు, గ్రామ గిరిజన పెద్దలు, అఖిలపక్ష నాయకుల సమక్షంలో సంతకాలు తీసుకున్న అనంతరం పట్టాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం రాజీపడదని, సంతకం చేసేందుకు ముందుకు రాని గ్రామాల్లో సర్టిఫికెట్లు ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు.
BIG Breaking: తెలంగాణ కొత్త సెక్రటేరియట్‌ ప్రారంభోత్సవం వాయిదా..

Exit mobile version