హైదరాబాద్ లోని ఓ నగల వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. వ్యాపారం నిమిత్తం మురళీకృష్ణ ఈ నెల 10న ముంబై నుంచి రూ.1.2 కోట్ల విలువైన వజ్రాలు, జాతిరత్నాలు తీసుకువచ్చారు. మురళీకృష్ణకు హైదరాబాద్లో మూడు ప్రాంతాల్లో వజ్రాలు, జాతిరత్నాల దుకాణాలు ఉన్నాయి. కాగా, ముధురానగర్లో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్న మురళీకృష్ణ.. లాక్డౌన్ నేపథ్యంలో అక్కడే వజ్రాలు, జాతిరత్నాలు విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో మిగిలిన వజ్రాలు, జాతిరత్నాలను ఇంట్లోనే ఉంచి ఆయన బయటకు వెళ్లాడు. మురళీకృష్ణ ఇంట్లో దాదాపు రూ.40 లక్షలు విలువ చేసే వజ్రాలు, జాతిరత్నాలను దొంగలు కాజేశారు. పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
40 లక్షలు విలువ చేసే వజ్రాలు, జాతిరత్నాలు చోరీ
