Site icon NTV Telugu

కన్న కూతురిపై అత్యాచారం కేసు.. ఎల్బీనగర్ కోర్టు సంచలన తీర్పు

కామంతో కళ్లు మూసుకుపోయిన తండ్రి.. కన్న కూతురిపై అత్యాచారం కేసులో సంచలన తీర్పు వెలువరించింది ఎల్బీ నగర్‌ కోర్టు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్టేషన్ పరిధిలో 2018లో కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడాడో కిరాతకుడు.. అయితే, ఈ కేసులో ఇవాళ తీర్పు వెలువరించింది ఎల్బీ నగర్ కోర్టులు.. నిందితుడికి 15 సంవత్సరాల జైలుతో పాటు 10 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.. ఇక, 2018లో ఈ కేసు వెలుగు చూడగా.. బాధితురాలితో పాటు తన చెల్లెకు 6 లక్షల చొప్పున పరిహారం చెల్లించి.. ఇద్దరు చిన్నారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలిచిన సంగతి తెలిసిందే.

Exit mobile version