భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు… హజీపూర్ లో ముగ్గురు అమ్మాయిలను అత్యాచారం చేసి హత్య చేసిన శ్రీనివాస్ రెడ్డి అనే నిందితుడిపై చర్యలు తీసుకోవాలని లేఖలో సీజేఐని కోరారు వీహెచ్… లోయర్ కోర్టు తీర్పు ఇచ్చినా.. హైకోర్టులో ఏడాదిన్నరగా కేసు పెండింగ్ లో ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. కాగా, హజీపూర్ ఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది.. ఈ కేసు లింక్లు హజీపూర్ నుంచి కర్నూలు వరకు వెలుగు చూశాయి… ఒంటరి మహిళలు, అమ్మాయిలను టార్గెట్ చేయడం.. వారికి లిఫ్ట్ పేరుతో బైక్పై ఎక్కించుకోవడం.. ఆ తర్వాత అత్యాచారం, హత్య చేయడమే ఈ కేసులో దొరికిపోయిన శ్రీనివాస్రెడ్డి పనిగా తేల్చారు. అయితే, ఈ కేసు విచారణ పెండింగ్లో ఉండడంపై సీజేఐ దృష్టికి తీసుకెళ్లారు వీహెచ్.