NTV Telugu Site icon

CM Revanth Reddy: నేడు సీఎం రేవంత్‌రెడ్డి కీలక సమావేశం..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి నేడు రాష్ట్ర సచివాలయంలో ప్రతిపక్ష పార్టీలతో కీలక సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి సాయంత్రం 4 గంటలకు విపక్షాలు సమావేశం కావాలని ఆహ్వానించారు. కొత్త రాష్ట్ర చిహ్నం, గీతం గురించి వారితో చర్చించనున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి రేవంత్ వారికి వివరించనున్నారు. ఈ సమావేశానికి పలు పార్టీల ముఖ్య నేతలు హాజరుకానున్నట్లు సమాచారం.

Read also: Harish Rao: మూడు నెలల పెండింగ్ జీతాలు చెల్లించండి.. హరీష్ రావు డిమాండ్

రాష్ట్ర చిహ్నం, గీతం మార్పులపై ఇప్పటికే బీఆర్‌ఎస్ పార్టీ మండిపడింది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ సహా పార్టీ నేతలు ఎలాంటి మార్పులు చేస్తే సహించేది లేదని ఘాటుగా స్పందించారు. చార్మినార్, కాకతీయ తోరణం రాచరికపు చిహ్నాలు కాదని, తెలంగాణ సంస్కృతికి నిదర్శనమని కేటీఆర్ అన్నారు. దీంతో రాజకీయ పార్టీలతో నిర్వహించనున్న సమావేశం ఉత్కంఠ రేపుతోంది. సీఎం రేవంత్ తన నిర్ణయాన్ని కొనసాగిస్తారా? లేక ప్రతిపక్షాల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుంటారా? అన్నది వేచి చూడాల్సిందే.

Read also: Hyderabad: అఖిల్‌గౌడ్ ను కఠినంగా శిక్షించండి.. అఖిల పేరెంట్స్ డిమాండ్

కాగా.. రాష్ట్ర చిహ్నంలో ఉన్న చార్మినార్, కాకతీయ ఆర్చ్ తొలగించడంపై బీఆర్‌ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నేడు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చారు. చార్మినార్ దగ్గర జరిగే నిరసన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొనే అవకాశం ఉంది. తెలంగాణ చారిత్రక కట్టడాలను లోగో నుంచి తొలగిస్తే నిరసన తెలుపుతామని బీఆర్‌ఎస్ నేతలు నిన్న సాయంత్రం వరంగల్‌లో ధర్నాకు దిగారు. వ్యక్తిగత ద్వేషంతో సీఎం రేవంత్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, మార్పుల జోడింపుపై కమిటీ వేస్తామని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆంధ్రాకు చెందిన కీరవాణితో రాష్ట్ర గీతం రూపొందించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. లోగో మార్పులపై హైకోర్టుకు వెళ్తామని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎంపీ వినోద్‌ తెలిపారు. అధికారిక చిహ్నాన్ని మార్చడం సాధ్యం కాదు.. కేంద్రం ఆమోదం పొందాలి.
Monsoon: నేటి నుంచి వర్షాకాలం ప్రారంభమైనట్టే.. నేడు,రేపు పొడివాతావరణం