Site icon NTV Telugu

CM KCR: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటన.. షెడ్యూల్ ఇదీ..

Cm Kcr

Cm Kcr

CM KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారం నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించి బీఆర్ఎస్ నేతల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ సోమవారం పర్యటించనున్నారు. మూడు జిల్లాలు, నాలుగు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, గద్వాల్ నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభలకు ప్రగతి ప్రతాద హాజరవుతారు. ఆయా ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు. దేవరకద్రలో, మధ్యాహ్నం 1:30 గం. గద్వాల్, మధ్యాహ్నం 2:40 గం. మక్తల్, సాయంత్రం 4:00గం. నారాయణపేట నియోజకవర్గాలు.. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి.

అన్ని చోట్లా పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని పార్టీ అభ్యర్థులు ఇప్పటికే సమావేశాలు నిర్వహించి నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కేసీఆర్ బహిరంగ సభలు నిర్వహించడంతో ఉమ్మడి జిల్లాలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. తాజాగా సీనియర్ నేతలంతా పార్టీలో చేరారు. కీలక సమావేశాలకు కేసీఆర్ హాజరుకావడం రాజకీయ వేడిని రాజేస్తోంది. బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఇప్పటికే అన్ని పార్టీల కంటే ముందుండి ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థులకు మద్దతుగా కేసీఆర్ అన్ని నియోజకవర్గాల్లో పర్యటించేందుకు తేదీలు కూడా ఖరారయ్యాయి. ఈ పర్యటనలను విజయవంతం చేసేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి నాలుగు చోట్ల ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటుండడంతో జిల్లా పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇప్పటికే హెలిప్యాడ్‌ల నిర్మాణం పూర్తయింది. సభా వేదిక, గ్యాలరీలను వేర్వేరుగా ఏర్పాటు చేశారు. సభలకు ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడంతో బీఆర్‌ఎస్‌లో ఉత్కంఠ నెలకొంది. దేవరకద్రలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మక్తల్‌లో చిట్టెం రాంమోహన్‌రెడ్డి, నారాయణపేటలో రాజేందర్‌రెడ్డి, గద్వాలలో బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఒకేరోజు ఉమ్మడి జిల్లాకు చెందిన నాలుగు సభల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. దేవరకద్ర, గద్వాల, నారాయణపేట, మక్తల్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలోని కురుమూర్తికి వెళ్లే రహదారిలోని బాలూర జూనియర్ కళాశాల మైదానంలో సభను ఏర్పాటు చేశారు. అనంతరం గద్వాల ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు కాగా ఇప్పటికే అయిజ రోడ్డులో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గద్వాల నుంచి మక్తల్ చేరుకుంటారు. మక్తల్ పట్టణంలోని ఎల్లమ్మకుంట కాటన్ మిల్లు వెనుక పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇక్కడి నుంచి నేరుగా నారాయణపేటకు వెళ్తారు. నారాయణపేట పట్టణంలోని స్టేడియం గ్రౌండ్‌లో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించనున్నారు. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్తారు. అన్ని చోట్లా పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని పార్టీ అభ్యర్థులు ఇప్పటికే సమావేశాలు నిర్వహించి నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సీఎం కేసీఆర్ నాలుగు చోట్ల ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటుండడంతో ఆయా నియోజకవర్గాల పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.

RTC Bus Accident: బెజవాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. కండక్టర్‌ సహా ఇద్దరు మృతి

Exit mobile version