గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్లో తెలంగాణ న్యాయాధికారుల సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ పై సీజేఐగా జస్టిస్ ఎన్వీ.రమణకు ప్రేమ, అభిమానం ఉంది కాబట్టే ఎన్నో రోజులుగా పరిష్కారంకాని సమస్యలను పరిష్కరించారన్నారు. ‘ఉమ్మడి హైకోర్టు విడిపోయాక బెంచీల సంఖ్య పెంపుపై గతంలో కేంద్రానికి, ప్రధాని మోదీకి లేఖ రాశాను. కానీ.. ఆ అంశం పెండింగ్ లోనే ఉండిపోయింది’.
‘సీజేఐగా ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టాక సమస్యను త్వరితగతిన పరిష్కరించారు. 24గా ఉన్న బెంచీల సంఖ్యను 42కు పెంచేలా కృషి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం తరపున జస్టిస్ ఎన్వీ రమణకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. బెంచీల సంఖ్యకు అనుగుణంగా 885 అదనపు పోస్టులను కూడా హైకోర్టుకు కేటాయించామన్నారు.
