QNET Scams: స్వప్నలోక్ అగ్నిప్రమాద ఘటన.. క్యూ నెట్ మోసాలపై సిటీ పోలీస్ చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
QNET Scams: క్యూ నెట్ మోసాలపై సిటీ పోలీస్ చర్యలు చేపట్టింది. స్వప్నలోక్ కాంప్లెక్స్ లో ఆరుగురి మృతికి కారణమైన క్యూనెట్ సంస్థపై చర్యలు తీకోనున్నట్లు వెల్లడించింది. స్వప్నలోక్ అగ్ని ప్రమాదంలో ఆరుగురు క్యూనెట్ సంస్థ ఉద్యోగులు మృతి చెందిన విషయం తెలిసిందే. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతోటి క్యూనెట్ లో ఉద్యోగాలు కల్పిస్తామంటూ నిరుద్యోగులకు వల వేస్తూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడినట్లు గుర్తించారు అధికారులు. పెట్టుబడులు పెడితే భారీ లాభాలు ఇస్తామంటూ స్వప్నలోక్ సంస్థ ప్రతినిధులు మోసాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలింది. నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి క్యూనెట్ వ్యాపారం చేసినట్లు గ్రహించారు. స్వప్నలోక్ ఆరుగురు మృతికి కారణమైన ముగ్గురు క్యూనెట్ సంస్థ ప్రతినిధులు అరెస్ట్ చేశారు.
స్వప్పలోక్ ఘటనతో తెలంగాణ రాష్ట్రం ఉలిక్కిపడేలా చేసింది. మార్చి 19 2023 అందరికి తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ఆరుగురు యువతులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే.. వీరంతా ‘క్యూ నెట్’ అనే కంపెనీలో పనిచేస్తున్నారు. అయితే వారు పనిచేసిన క్యూనెట్ కంపెనీపై ప్రభుత్వం కూపీ లాగుతోంది. ఈ క్యూనెట్ కంపెనీ నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి లక్షల రూపాయలను దోచుకుంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీనిపై వెంటనే స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా పూర్తిస్థాయిలో విచారణ చేయాలని సూచించారు. ఘటన జరిగిన సమయంలో క్యూనెట్ బాధితురాలు చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ఈ కంపెనీపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని.. ఈ కంపెనీ నిరుద్యోగులను మోసం చేస్తోందని బాధితుడు ఫణి ఆవేదన వ్యక్తం చేశాడు. 5 లక్షలు చెల్లించి మోసపోయానని 2018లో ఫిర్యాదు చేశాడు. తమ కేసు సుప్రీంకోర్టులో ఉందని తెలిపాడు.
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
అయితే దీంతో క్యూనెట్ పై ప్రభుత్వం దృష్టి సారించింది. చనిపోయిన ఆరుగురు కష్టపడి క్యూ నెట్వర్క్లో చేరారు. మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో యూనిట్ కంపెనీ డబ్బులు ఇస్తానని, కమీషన్ కూడా ఇస్తానని మాయమాటలు చెప్పి మోసం చేస్తోంది. ఈ క్యూనెట్లో 40 మందికి పైగా యువకులు పనిచేస్తున్నారు. క్యూనెట్ ఏజెంట్లు ఒక్కొక్కరి నుంచి ఒకటిన్నర నుంచి మూడు లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. Qnet మోసపూరిత వాగ్దానాలు చేయడం ద్వారా యువతను ఆకర్షిస్తుంది. మలేషియా, సింగపూర్ లకు తీసుకొచ్చేందుకు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.అయితే.. ఈ విషయం బయటకు రావడంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. గతంలో సజ్జనార్ క్యూనెట్ మోసాలపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నించారు. అయితే క్యూ నెట్ పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న సంస్థపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. క్యూ నెట్ కారణంగా మధ్యతరగతి కుటుంబాలు నష్టపోతున్నాయి.” సజ్జనార్ వెల్లడించారు.
Helmets-Hair loss: హెల్మెట్ వల్ల జుట్టు రాలుతుందా? అయితే..
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!