Balasani Laxminarayana: బీఆర్ఎస్ కు రాజీనామా అందుకే.. బాలసాని క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balasani Laxminarayana: బీసీ లకు జరిగిన అవమానం కోసం రాజీనామా చేశానని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అన్నారు. నా ఆత్మభిమానం దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా సార్లు అవమానించారని అన్నారు. అధిష్టానంకు చెప్పుకుంటే పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా ఎన్నో అవమానాలు భరించానని అన్నారు. అధికార మదంతో BRS నాయకులు ప్రవర్తించారని అన్నారు. మావోయిస్టు ప్రాంతంలో కష్టపడి పనిచేశానని అన్నారు. తాతా మధు పెద్ద పుడింగా అంటూ మండిపడ్డారు. పార్టీ కోసం పనిచేసిన నన్ను పక్కన పెట్టి పుడింగికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కటేమిటి చాలా అవమానాలు జరిగాయన్నారు. భద్రాచలం ఇంచార్జి నుంచి తొలగించడానికి కారణం చెప్పలేదు కాబట్టే రాజీనామా చేస్తున్నానని అన్నారు. పుడింగి సంగతేంటో రాబోయే ఎన్నికల్లో అక్కడే చూస్తానని అన్నారు. బీసీ లకు జరిగిన అవమానం కోసం రాజీనామా చేశానని తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఎంతమంది బీసీ లకు పదవులిచ్చారో చెప్పాలి? అని ప్రశ్నించారు. పొన్నాల లక్ష్మయ్యను ఆహ్వానిస్తావ్…..మమ్మల్ని అవమణిస్తావా కేటీఆర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు పంపారు. బాలసాని లక్ష్మీనారాయణ 1987లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగారు. ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరపున రెండుసార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై శాసనసభలో అడుగుపెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భాగంగా భద్రాచలం బీఆర్ఎస్ ఇన్చార్జి పదవి నుంచి తప్పించడంతో బాలసాని లక్ష్మీనారాయణ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. 2009లో టీడీపీ నుంచి తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2015లో ఖమ్మం స్థానిక సంస్థ నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి సీపీఐ అభ్యర్థి పువ్వాడ నాగేశ్వర్రావుపై 31 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ) సభ్యుడిగా ఉన్న ఆయన.. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరనున్న సంగతి తెలిసిందే.
Also Read
- Good News : ఇక వాట్సాప్లోనే మార్కుల మెమో.. తెలంగాణ విద్యార్థులకు గుడ్న్యూస్.!
- Hyderabad : కేబీఆర్ పార్క్ దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే.!
- Gandhi Sarovar Project : మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్.. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్
- KTR : హామీల ఊసే లేదు.. రాష్ట్రాన్ని మాఫియా నడుపుతోంది
తాజావార్తలు
-
MK Stalin: రాహుల్గాంధీకి వెరైటీగా బర్త్డే విషెస్ చెప్పిన స్టాలిన్
-
Gas Lighter Cleaning Tips: గ్యాస్ లైటర్పై మొండి మురికి పోవట్లేదా?.. ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్
-
Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ బిగ్ షాక్.. హార్ముజ్ మళ్లీ మూసివేత
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవుట్..? తుది జట్టులో ఊహించని మార్పులు..
-
Good News : ఇక వాట్సాప్లోనే మార్కుల మెమో.. తెలంగాణ విద్యార్థులకు గుడ్న్యూస్.!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?