Ayodhya Online Scams: అయోధ్యపై ఆన్లైన్ మోసాలు.. జర భద్రం అంటున్న సైబర్ పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Online Scams: అయోధ్య రామమందిరాన్ని జనవరి 22వ తేదీ సోమవారం ప్రారంభంకానుంది. ఇందుకు సంబంధించి ఆలయ అధికారులు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సిబ్బంది దాదాపు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. అయితే రామాలయ ప్రారంభోత్సవానికి ముందు సోషల్ మీడియాలో రకరకాల ఆన్లైన్ మోసాల గురించి కొన్ని వార్తలు వచ్చాయి. ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో ప్రసాదం, వీఐపీ ఎంట్రీ పేరుతో సైబర్ నేరగాళ్లు చాలా మందిని మోసం చేయడం ప్రారంభించారు. ఇలాంటి మోసాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. అయోధ్య రామమందిరంలో వీఐపీ పాస్లు జారీ చేస్తున్నట్లు ఇటీవల వాట్సాప్లో మెసేజ్లు హల్చల్ చేస్తున్నాయి. రామ్ మందిర్ అభియాన్ పేరుతో ఉన్న Apk ఫైల్ను డౌన్లోడ్ చేసుకోవాలని వినియోగదారులను అభ్యర్థించారు. అయితే ఇదంతా అవాస్తవమని.. పొరపాటున ఆ లింక్ పై క్లిక్ చేయవద్దని.. ఎవరూ డౌన్ లోడ్ చేసుకోవద్దని సైబర్ నిపుణులు వెల్లడించారు.
Read also: Israel Hamas War: గాజాలో రోజురోజుకు దిగజారిపోతున్న మహిళలు, చిన్నారుల పరిస్థితి
Also Read
ఎందుకంటే రామమందిరానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి యాప్ను తయారు చేయలేదు. కాబట్టి వీఐపీ ఎంట్రీ పాస్పై వస్తున్న మెసేజ్ల పట్ల అధికారులు జాగ్రత్తగా ఉండాలని కోరారు. మీరు ఈ యాప్ని మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే, మీ వ్యక్తిగత డేటా దొంగిలించబడవచ్చు. సామాజిక మాధ్యమాల్లో రామమందిరం పేరుతో అనేక నకిలీ పేజీలు సృష్టించారని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ అన్నారు. అక్కడ రామమందిర నిర్మాణానికి వినియోగదారుల నుంచి విరాళాలు తీసుకుంటున్నారు. ఇలాంటి ఫేక్ సోషల్ మీడియా పేజీల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రామమందిర ప్రసాదం ఉచితంగా లభిస్తుందా? అవుననే సమాధానం రావడం గమనార్హం. దీనికి సంబంధించి తాజాగా ఓ వెబ్సైట్ అలాంటి క్లెయిమ్ చేసింది. డెలివరీ ఫీజుగా 50 రూపాయలు వసూలు చేస్తారు. కానీ మీడియా కథనాల ప్రకారం, వెబ్సైట్ ప్రభుత్వానికి లేదా ఆలయ అధికారులకు సంబంధించినది కాదు. కాబట్టి ఏదైనా వెబ్సైట్లో డబ్బు లేదా వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చే ముందు ప్రతిదీ ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయండి.
Read also: Rolls Royce Spectre : రూ.7.5కోట్ల రోల్స్ రాయిస్ స్పెక్టర్ కారు లాంచ్.. లగ్జరీ కారు ఫీచర్లు ఇవే
వివిధ ఈ-కామర్స్ వెబ్సైట్లు రామమందిర ప్రసాదం పేరుతో ప్రసాదం ప్యాకెట్లను విక్రయించడం ప్రారంభించాయి. ఆలయ ప్రారంభోత్సవానికి ముందే డబ్బులు దండుకునేందుకు మోసగాళ్లు కుట్ర పన్నుతున్నారు. కానీ జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం తర్వాతే ప్రసాదం అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు. Facebook, Whatsappలో రామమందిరం కోసం విరాళాలు పంపడానికి ఏవైనా QR కోడ్ లేదా అభ్యర్థనలను నమ్మవద్దు. ఇవి పూర్తిగా అవాస్తవం. రామమందిరం పేరుతో ఈ రకమైన నకిలీ క్యూఆర్ కోడ్ బహుళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వ్యాపించింది. జనవరి 22, సోమవారం రామమందిరం అట్టహాసంగా ప్రారంభంకానుంది. ఆ తర్వాత, సాధారణ భక్తులు, ప్రజలను ఆలయ దర్శనానికి అనుమతిస్తారు. ఇందుకోసం ప్రభుత్వం, ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయం తెరిచే వరకు ఎలాంటి ఆన్లైన్ మోసాల బారిన పడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Israel Hamas War: గాజాలో రోజురోజుకు దిగజారిపోతున్న మహిళలు, చిన్నారుల పరిస్థితి
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!