Anchor Swetcha : స్వేచ్ఛ మృతికి కారణం పూర్ణచందర్నాయకే.. స్వేచ్ఛ మేనమామ అత్త
- స్వేచ్ఛ తల్లిదండ్రులు జనశక్తి పార్టీ కొన్నేళ్ల పాటు పనిచేశారు
- ఆ సమయంలో స్వేచ్ఛను మా దగ్గర వదిలారు
- పూర్ణ చందర్ తో గత 5 సంవత్సరాలు నుంచి కలిసి ఉంటుంది
- స్వేచ్ఛ చావుకి కారణం పూర్తిగా పూర్ణ చందర్ నాయకే : మేనమామ అత్త సుశీల నరసయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anchor Swetcha : ప్రముఖ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో ఒక్కొక్కటిగా కొత్త వివరాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకు ఆమె కుమార్తె అరణ్య, తండ్రి శంకర్ ఆరోపణలు చేసిన అనంతరం ఇప్పుడు స్వేచ్ఛను పదేళ్లపాటు పెంచిన మేనమామ అత్త సుశీల నరసయ్య కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. స్వేచ్ఛ చిన్ననాటి నుంచి తమ ఇంటిలో ఎంతో ప్రేమతో పెరిగిందని ఆమె భావోద్వేగంగా గుర్తుచేశారు.
సుశీల మాట్లాడుతూ .. “స్వేచ్ఛను నాలుగు నెలల పాపగా ఉన్నప్పటి నుంచి పదేళ్లు మా ఇంట్లో పెంచుకున్నాం. తన తల్లిదండ్రులు జనశక్తి పార్టీలో పనిచేస్తూ బిజీగా ఉండేవారు. అప్పుడు మమ్మల్ని నమ్మి ఆమెను మా దగ్గరే వదిలారు. స్వేచ్ఛకు ఏ లోటూ లేకుండా ఎంతో ప్రేమ, ఆప్యాయతలతో పెంచాం. మా సొంత పిల్లల కన్నా ఎక్కువ ప్రేమ చూపించాం” అని చెప్పారు.
Also Read
గత ఐదేళ్లుగా స్వేచ్ఛ పూర్ణచందర్ నాయక్తో సహజీవనం చేస్తూ వస్తోంది. వీరి మధ్య తరచూ గొడవలు జరిగేవని, పూర్ణచందర్ స్వయంగా వారికి ఫోన్ చేసి చెప్పిన సందర్భాలూ ఉన్నాయని చెప్పారు. పూర్ణచందర్ కుటుంబానికి స్వేచ్ఛ ఎంతో సుపరిచితమని, అతడి తండ్రి అనేకసార్లు స్వేచ్ఛ ఇంటికి వచ్చేవాడని పేర్కొన్నారు.
వారిద్దరు అరుణాచలంలో కలిసి ఉండగా స్వేచ్ఛ పూర్ణచంద్ర ఫోన్లో ఉన్న కొన్ని ఫోటోలు చూసిందని, అందులో ఏదో దాచిన విషయం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అదే సమయంలో పూర్ణచందర్ తాత డెత్ యానివర్సరీ సందర్భంగా స్వేచ్ఛను తీసుకెళ్లకపోవడం ఆమెను తీవ్ర మనోవేదనకు గురిచేసిందని తెలిపారు.
పూర్ణచందర్ నాయక్ కుటుంబంలో తనకు స్థానం లేదని స్వేచ్ఛ అనేకసార్లు బాధపడేదని, కుటుంబ సభ్యురాలిగా ఎందుకు గుర్తించరన్న ప్రశ్నలు ఆమెను తీవ్ర ఆత్మగౌరవ దెబ్బకు గురి చేశాయని చెప్పారు. ఈ నిరాదరణే స్వేచ్ఛను డిప్రెషన్లోకి నెట్టేసిందని పేర్కొన్నారు.
అరుణాచలం నుంచి స్వేచ్ఛ ఒంటరిగా నెల్లూరు బస్టాండ్కి వెళ్లగా, అక్కడి నుంచి పూర్ణచందర్ ఆమెను హైదరాబాద్కు తీసుకొచ్చాడని తెలిపారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా ఇద్దరి మధ్య గొడవలు ఆగలేదని, మానసికంగా మరింత క్షోభకు లోనైన స్వేచ్ఛ చివరకు తన ప్రాణాలు తీసుకుందని సుశీల కన్నీటి స్వరంతో చెప్పారు.
ఇప్పుడు పూర్ణచందర్ నాయక్ “ఆమెకు నా భార్యస్థానం ఇచ్చా” అంటూ తాను బాధ్యత వహించానని చెబుతూ కేసును తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. “నిజానికి స్వేచ్ఛ చావుకు కారణం పూర్ణచందర్ నాయకే. మేము చూసిన, చవిచూసిన అన్ని విషయాలు అదే చెబుతున్నాయి” అంటూ తన వేదనను వ్యక్తం చేశారు.
KhushiKapoor : గ్లామరస్ ఫొటోస్ తో కనుల విందు చేస్తున్న ఖుషి కపూర్…
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!