Anchor Swetcha : స్వేచ్ఛ మృతికి కారణం పూర్ణచందర్నాయకే.. స్వేచ్ఛ మేనమామ అత్త
- స్వేచ్ఛ తల్లిదండ్రులు జనశక్తి పార్టీ కొన్నేళ్ల పాటు పనిచేశారు
- ఆ సమయంలో స్వేచ్ఛను మా దగ్గర వదిలారు
- పూర్ణ చందర్ తో గత 5 సంవత్సరాలు నుంచి కలిసి ఉంటుంది
- స్వేచ్ఛ చావుకి కారణం పూర్తిగా పూర్ణ చందర్ నాయకే : మేనమామ అత్త సుశీల నరసయ్య
Anchor Swetcha : ప్రముఖ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో ఒక్కొక్కటిగా కొత్త వివరాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకు ఆమె కుమార్తె అరణ్య, తండ్రి శంకర్ ఆరోపణలు చేసిన అనంతరం ఇప్పుడు స్వేచ్ఛను పదేళ్లపాటు పెంచిన మేనమామ అత్త సుశీల నరసయ్య కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. స్వేచ్ఛ చిన్ననాటి నుంచి తమ ఇంటిలో ఎంతో ప్రేమతో పెరిగిందని ఆమె భావోద్వేగంగా గుర్తుచేశారు.
సుశీల మాట్లాడుతూ .. “స్వేచ్ఛను నాలుగు నెలల పాపగా ఉన్నప్పటి నుంచి పదేళ్లు మా ఇంట్లో పెంచుకున్నాం. తన తల్లిదండ్రులు జనశక్తి పార్టీలో పనిచేస్తూ బిజీగా ఉండేవారు. అప్పుడు మమ్మల్ని నమ్మి ఆమెను మా దగ్గరే వదిలారు. స్వేచ్ఛకు ఏ లోటూ లేకుండా ఎంతో ప్రేమ, ఆప్యాయతలతో పెంచాం. మా సొంత పిల్లల కన్నా ఎక్కువ ప్రేమ చూపించాం” అని చెప్పారు.
Also Read
గత ఐదేళ్లుగా స్వేచ్ఛ పూర్ణచందర్ నాయక్తో సహజీవనం చేస్తూ వస్తోంది. వీరి మధ్య తరచూ గొడవలు జరిగేవని, పూర్ణచందర్ స్వయంగా వారికి ఫోన్ చేసి చెప్పిన సందర్భాలూ ఉన్నాయని చెప్పారు. పూర్ణచందర్ కుటుంబానికి స్వేచ్ఛ ఎంతో సుపరిచితమని, అతడి తండ్రి అనేకసార్లు స్వేచ్ఛ ఇంటికి వచ్చేవాడని పేర్కొన్నారు.
వారిద్దరు అరుణాచలంలో కలిసి ఉండగా స్వేచ్ఛ పూర్ణచంద్ర ఫోన్లో ఉన్న కొన్ని ఫోటోలు చూసిందని, అందులో ఏదో దాచిన విషయం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అదే సమయంలో పూర్ణచందర్ తాత డెత్ యానివర్సరీ సందర్భంగా స్వేచ్ఛను తీసుకెళ్లకపోవడం ఆమెను తీవ్ర మనోవేదనకు గురిచేసిందని తెలిపారు.
పూర్ణచందర్ నాయక్ కుటుంబంలో తనకు స్థానం లేదని స్వేచ్ఛ అనేకసార్లు బాధపడేదని, కుటుంబ సభ్యురాలిగా ఎందుకు గుర్తించరన్న ప్రశ్నలు ఆమెను తీవ్ర ఆత్మగౌరవ దెబ్బకు గురి చేశాయని చెప్పారు. ఈ నిరాదరణే స్వేచ్ఛను డిప్రెషన్లోకి నెట్టేసిందని పేర్కొన్నారు.
అరుణాచలం నుంచి స్వేచ్ఛ ఒంటరిగా నెల్లూరు బస్టాండ్కి వెళ్లగా, అక్కడి నుంచి పూర్ణచందర్ ఆమెను హైదరాబాద్కు తీసుకొచ్చాడని తెలిపారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా ఇద్దరి మధ్య గొడవలు ఆగలేదని, మానసికంగా మరింత క్షోభకు లోనైన స్వేచ్ఛ చివరకు తన ప్రాణాలు తీసుకుందని సుశీల కన్నీటి స్వరంతో చెప్పారు.
ఇప్పుడు పూర్ణచందర్ నాయక్ “ఆమెకు నా భార్యస్థానం ఇచ్చా” అంటూ తాను బాధ్యత వహించానని చెబుతూ కేసును తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. “నిజానికి స్వేచ్ఛ చావుకు కారణం పూర్ణచందర్ నాయకే. మేము చూసిన, చవిచూసిన అన్ని విషయాలు అదే చెబుతున్నాయి” అంటూ తన వేదనను వ్యక్తం చేశారు.
KhushiKapoor : గ్లామరస్ ఫొటోస్ తో కనుల విందు చేస్తున్న ఖుషి కపూర్…
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!