Amit Shah: ఈ ఎన్నికలు జిహాద్ కు, అభివృద్ధికి మధ్య జరుగుతుంది.. అమిత్ షా హాట్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: ఈ ఎన్నికలు జిహాద్ కు, అభివృద్ధికి మధ్య జరుగుతోందని భువనగిరి జన సభలో అమిత్ షా హాట్ కామెంట్స్ చేశారు. జై శ్రీరామ్ నినాదంతో అమిత్ షా ప్రసంగం ప్రారంభించారు. ఈ ఎన్నిక రాహుల్, మోదీకి మధ్య జరుగుతుంది.. ఎన్నిక జిహాద్, అభివృద్ధికి మధ్య జరుగుతున్నాయన్నారు. కుటుంబ పాలనకు, భారతీయ కుటుంబానికి మధ్య పోటీ జరుగుతుందన్నారు. మూడు విడతల పోలింగ్ తర్వాత 200 స్థానాలు బీజేపీ గెలుస్తుందన్నారు. తెలంగాణలో 10 కంటే ఎక్కువ లోక్సభ స్థానాలు గెలుస్తామన్నారు. 400 సీట్లు ఇవ్వడానికి మార్గాన్ని సుగమం చేస్తుందని తెలిపారు. భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీకి సన్నిహితుడన్నారు. రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసిన వ్యక్తికే కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నాడని, మోడీ 10 ఏళ్లుగా పూర్తి మెజారిటీతో అధికారంలో ఉన్నా రిజర్వేషన్లు తొలగించలేదన్నారు.
Read also: crime news: భర్తతో విభేదాల కారణంగా తన మూడేళ్ల కుమారుడికి కాల్చి చంపిన తల్లి
Also Read
తెలంగాణలో 10 కంటే ఎక్కవ సీట్లు బీజేపీ కి వస్తే ముస్లిం రిజర్వేషన్లు తొలగించి.. ఆ రిజర్వేషన్లను ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇస్తామన్నారు. మోడీ చెప్పిందే.. చేస్తాడు… అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. రామ మందిర నిర్మాణ వాగ్దానం నెరవేర్చిన మోడీది అని తెలిపారు. 370 ఆర్టికల్ రద్దుచేసి కాశ్మీర్ మనదేనని దేశానికి చెప్పాయన్నారు. దేశంలో తీవ్రవాదం, మావోయిజన్ని దూరం చేసి, దేశాన్ని సురక్షితం చేశాయన్నారు. టెక్స్ టైల్ రంగాన్ని అభివృద్ధి చేసి.. పెద్ద ఎత్తున ఉపాధి కల్పించిన ఘనత మోడీ ది అని తెలిపారు. ఎయిమ్స్ ఏర్పాటు చేసి ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాకు మెరుగైన వైద్య సేవలు అందించామన్నారు.
Read also: Poppy Seeds Benefits : గసగసాలు రోజూ తీసుకుంటే మహిళలకు ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
అసదుద్దీన్, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే అని కీలక వ్యాఖ్యలు చేశారు. షరియత్, ఖురాన్, ఆధారంగా తెలంగాణను నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రిపుల్ తలాక్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు. పదేళ్లు అధికారంలో ఉంటే.. కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఏటీఎం మార్చుకుందన్నారు. 10 కంటే ఎక్కువ స్థానాల్లో గెలిపిస్తే తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ గా చేస్తాం జైశ్రీరామ్ నినాదంతో ప్రసంగాన్ని అమిత్ షా ముగించారు. మరి కాసేపట్లో తిరుగు ప్రయాణం కానున్నారు.
KCR: కేసీఆర్ బస్సు యాత్రలో చేతివాటం.. డిప్యూటీ మేయర్ బంగారం, కౌన్సిలర్ డబ్బు చోరీ..
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!