Adilabad Students: ప్రిన్సిపల్, వార్డన్ వేధిస్తున్నారు.. పోలీస్ స్టేషన్ ముందు విద్యార్థులు నిరసన..
- ప్రిన్సిపల్- వార్డన్ వేధిస్తున్నారు..
- పోలీస్ స్టేషన్ ముందు విద్యార్థులు నిరసన..
- ఆదిలాబాద్ వ్యాప్తంగా సంచలనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adilabad Students: ప్రిన్సిపల్, వార్డన్ వేధిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ ముందు విద్యార్థులు నిరసనకు దిగిన ఘటన ఆదిలాబాద్ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట విద్యార్థులు బైఠాయించారు. ప్రిన్సిపల్, ఇతర టీచర్లు వేధిస్తున్నారంటూ టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు విద్యార్థులు భారీ ఎత్తున తరలివచ్చారు. పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేయడం కోసం ఎం జే పీ విద్యార్థులు వచ్చారు. తెల్లవారు ఝామున మూడు గంటలకు ఎవరికి తెలియకుండా గోడ దూకి వచ్చామని తెలిపారు. హాస్టల్ నుంచి సుమారు 7 కిలో మీటర్ల దూరం నుంచి నడుచు కుంటూ జిల్లా కేంద్రంలో ని టూ టౌన్ పోలీసు స్టేషను కు 10 వ తరగతి విద్యార్థులు వచ్చారు. ప్రిన్సిపల్, వార్డన్ వేదిస్తున్నారని వాపోయారు. మా సమస్యల్ని చెప్పితే.. సర్టిఫికెట్ల మీద బ్యాడ్ అంటూ రిమార్క్ రాస్తానని బెదిరించారని విద్యార్థుల ఆరోపించారు.
Also Read
అందుకే 5 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటాం అంటూ వాపోయారని.. పోలీసులు న్యాయం చేస్తారనే నమ్మకంతోనే వారికి నచ్చ జెప్పి పోలీసు స్టేషన్ కు వచ్చామని విద్యార్థులు ఆదేవన వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ ను తొలగించాలని, అప్పుడే హాస్టల్ కు వెళ్తాం అని విద్యార్థలు తెలిపారు. దీంతో పోలీస్టేషన్ ముందు గందరగోళ పరిస్థితి నెలకొంది. విద్యార్థుల ఆవేదనను చూసిన పోలీసులు వెంటనే ప్రిన్సిపల్ కు కాల్ చేసి ఇక్కడి పరిస్థితిపై వివరించారు. అయితే దీనిపై ప్రిన్సిపల్ పొంతలేని సమాధానం చెప్పడంతో పోలీసులు సీరియస్ అయ్యారని సమాచారం. విద్యార్థులకు న్యాయం చేస్తామని తెలిపారు. ప్రిన్సిపల్ , వార్డన్ పనితీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవతున్నాయని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశారా? లేదా? అనే దానిపై ఇంకా తెలియరాలేదు.. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గత కొద్ది నెలలుగా తెలంగాణ పాఠశాలల్లో పిల్లలపై ప్రిన్సిపల్, వార్డెన్ లు వేధిస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇలాంటి ఘటనే ఆదిలాబాద్ లో చోటుచేసుకోవడంతో ఈ ఘటన సంచలనంగా మారింది. మరి దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారునేది ప్రశ్నార్థకంగా మారింది.
CM Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి..
తాజావార్తలు
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
-
OTR: అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ జనసేన
-
OTR: యాదాద్రి కమిటీ.. కాంగ్రెస్లో చిచ్చు రేపిందా?
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
ట్రెండింగ్
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!