Adilabad: ఉమ్మడి జిల్లాలో హడలెత్తిస్తున్న పులులు.. ఒకవైపు మగ పులి, మరో వైపు ఆడపులి
- ఉమ్మడి జిల్లాలో హడలెత్తిస్తున్న పులులు..
- ఒకవైపు మగ పులి, మరో వెైపు ఆడపులి..
- తోడు కోసం ఆరాటం వందల కిలో మీటర్ల ప్రయాణం..
- అడ్డొచ్చిన ఆవులు, ఎద్దుల పై దాడి..
- అటు ఆకలి తీర్చుకుంటూ ఇటు తోడు కోసం ఆరాటం..
- అడవులు, కొండలు, గుట్టలు, పంటచేనులను చుట్టేస్తున్న పులులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులులు హడలెత్తిస్తున్నాయి. ఒకవైపు మగ పులి, మరో వైపు ఆడపులి సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తోడు కోసం వందల కిలో మీటర్ల ప్రయాణం చేస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. అడ్డొచ్చిన ఆవులు, ఎద్దుల పై దాడి చేస్తూ ముందుకు సాగుతున్నాయి. అటు ఆకలి తీర్చుకుంటూ ఇటు తోడు కోసం ఆరాటం పడుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ రెండు పులులు అడవులు, కొండ,గుట్టలు, పంటచేనులను చుట్టేస్తున్నట్లు తెలిపారు. మెటింగ్ సీజన్ కావడంతో ఆ రెండు కలుస్తాయని అటవీ శాఖ అధికారులు అంటున్నారు. మహారాష్ట్ర నుండి నిర్మల్, బోథ్ సరిహద్దు మండలాల్లోకి ప్రవేశించన పులి జానీగా గుర్తించారు. గత నెల 23 న తెలంగాణలోకి ప్రవేశించి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా అడవుల్లో సంచరిస్తున్నట్లు తెలిపారు.
Read also: CM Revanth Reddy: నేడు వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
Also Read
మరో వైపు రెండు నెలల క్రితం కొమురం భీం జిల్లా కెరమేరి అడవుల్లోకి వచ్చిన ఆడ పులి జోడేఘాట్ అడవుల్లో సంచరించింది. ప్రస్తుతం రెండు టైగర్స్ సమీపంకు చేరుకున్న ట్లు అధికారులు గుర్తించారు. కేవలం పదుల కిలో మీటర్ల దూరంలోనే రెండు పులులు సంచరిస్తున్నట్లు తెలిపారు. రెండు పులుల సంచారంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. పులి సంచరించే ప్రాంతాల్లో అటవీ శాఖ అప్రమత్తమైంది. ఆయా గ్రామాల్లో పులి రక్షణపై జనంకు అవగాహన కల్పిస్తు్న్నారు. పులులకు హాని తలపెట్టే ఉచ్చులు, విద్యుత్ వైర్లు పెట్టకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పులులకు హాని తల పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ హెచ్చరించింది. పశువులపై పులులు దాడి చేస్తే వెంటనే పరిహారం చెల్లింపు ఉంటుందని తెలిపారు.
Pushpa -2 : ఇది సార్ ‘పుష్పరాజ్’ గాని బ్రాండ్..
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!