Online Game: ప్రాణాల మీదకు తెచ్చిన ఆన్లైన్ గేమ్.. పురుగుల మందు తాగిన బాధితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Online Game: ఆన్లైన్ గేమ్ ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. ఆన్లైన్ రమ్మీ గేమ్ కోసం పనిచేస్తున్న పెట్రోల్ బంక్ నుంచి లక్షల రూపాయలను వెచ్చించారు. లెక్కలో 6 లక్షల రూపాయలు తేడా రావడంతో పెట్రోల్బంక్ యాజమాన్యం పోలీసులకు పిర్యాదు చేశారు. అందులో పనిచేస్తున్న యువకుడే ఈ పని చేపట్టడాని తెలడంతో.. రికవరీ పేరిట ఇంటిని రాయించుకున్నారు. దీంతో మనస్తాపం చెందిన ఆ యువకుడు పురుగుల మందు తాగిన ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన హనుమకొండలో కలకలం రేపింది.
Read also: Election Commission: లావాదేవీలపై నిఘా పెట్టండి.. రాష్ట్రాలకు ఈసీ లేఖ
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
హనుమకొండ జిల్లా పరకాలలోని వెలుమవాడకు చెందిన ఎండీ గౌష్ పాషా గుడెప్పాడ్ లోని జీకే పెట్రోల్ బంక్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. గౌష్ పాషా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాందించాలనే ఆలోచనతో రమ్మీ ఆన్లైన్ గేము అలవాటు పడి 6లక్షల రూపాయలలో పొగొట్టాడు. పెట్రోల్ పంపులో మేనేజర్ గా పని చేస్తున్న గౌష్ పాషా పెట్రోల్ పంపు కు సంబంధించిన డబ్బులను ఆన్లైన్ గేమ్ కి ఖర్చు చేశాడు. బంకు యజమాని లెక్కలు చెక్ చేసుకోగా సుమారుగా 6 లక్షల వరకు తేడా రావడంతో షాక్ తిన్నారు. వెంటనే ఈ నెల 18న ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా ఆ డబ్బులు రికవరీ చేసేందుకు గౌస్ పాషా ఇంటిని 100 రూపాయల స్టాంప్ కాగితంపై రాయించుకున్నారు.
Read also: Delhi Liquor Scam: నేడు సుప్రీంలో ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై విచారణ..!
అదే రోజు ఇంటికి చేరుకున్న గౌష్ పాషా ఎంతో కష్ట పడి తన తల్లిదండ్రులు కట్టుకున్న ఇంటిని బంక్ యజమానులు రాయించుకోవడం తెలిస్తే తట్టుకో లేరని మనస్తాపం చెంది ఈ నెల 19న పురుగుల మందు తాగాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని.. మీరంతా తనను మరిచిపోవాలని తల్లి, తమ్ముడికి ఫోన్ చేశాడు. దీంతో వారు పోలీసులను సంప్రదించగా, పరకాల బంధం రోడ్డులో పురుగుల మందు తాగి ప్రాణపాయ స్థితిలో ఉన్నట్టు గుర్తించారు. పోలీసులు గౌష్ పాషా వెంటనే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. తన కొడుకు ఆత్మహత్యయత్నానికి బంక్ యాజమానుల వేధింపులే కారణమని బాధి తుడి తల్లి ఎండీ ఫర్వీనా పరకాల పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటి వరకు జైలుకు వెళ్లింది వీళ్లే..?
తాజావార్తలు
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
-
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
-
Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
-
Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!