Online Game: ప్రాణాల మీదకు తెచ్చిన ఆన్లైన్ గేమ్.. పురుగుల మందు తాగిన బాధితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Online Game: ఆన్లైన్ గేమ్ ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. ఆన్లైన్ రమ్మీ గేమ్ కోసం పనిచేస్తున్న పెట్రోల్ బంక్ నుంచి లక్షల రూపాయలను వెచ్చించారు. లెక్కలో 6 లక్షల రూపాయలు తేడా రావడంతో పెట్రోల్బంక్ యాజమాన్యం పోలీసులకు పిర్యాదు చేశారు. అందులో పనిచేస్తున్న యువకుడే ఈ పని చేపట్టడాని తెలడంతో.. రికవరీ పేరిట ఇంటిని రాయించుకున్నారు. దీంతో మనస్తాపం చెందిన ఆ యువకుడు పురుగుల మందు తాగిన ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన హనుమకొండలో కలకలం రేపింది.
Read also: Election Commission: లావాదేవీలపై నిఘా పెట్టండి.. రాష్ట్రాలకు ఈసీ లేఖ
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
హనుమకొండ జిల్లా పరకాలలోని వెలుమవాడకు చెందిన ఎండీ గౌష్ పాషా గుడెప్పాడ్ లోని జీకే పెట్రోల్ బంక్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. గౌష్ పాషా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాందించాలనే ఆలోచనతో రమ్మీ ఆన్లైన్ గేము అలవాటు పడి 6లక్షల రూపాయలలో పొగొట్టాడు. పెట్రోల్ పంపులో మేనేజర్ గా పని చేస్తున్న గౌష్ పాషా పెట్రోల్ పంపు కు సంబంధించిన డబ్బులను ఆన్లైన్ గేమ్ కి ఖర్చు చేశాడు. బంకు యజమాని లెక్కలు చెక్ చేసుకోగా సుమారుగా 6 లక్షల వరకు తేడా రావడంతో షాక్ తిన్నారు. వెంటనే ఈ నెల 18న ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా ఆ డబ్బులు రికవరీ చేసేందుకు గౌస్ పాషా ఇంటిని 100 రూపాయల స్టాంప్ కాగితంపై రాయించుకున్నారు.
Read also: Delhi Liquor Scam: నేడు సుప్రీంలో ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై విచారణ..!
అదే రోజు ఇంటికి చేరుకున్న గౌష్ పాషా ఎంతో కష్ట పడి తన తల్లిదండ్రులు కట్టుకున్న ఇంటిని బంక్ యజమానులు రాయించుకోవడం తెలిస్తే తట్టుకో లేరని మనస్తాపం చెంది ఈ నెల 19న పురుగుల మందు తాగాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని.. మీరంతా తనను మరిచిపోవాలని తల్లి, తమ్ముడికి ఫోన్ చేశాడు. దీంతో వారు పోలీసులను సంప్రదించగా, పరకాల బంధం రోడ్డులో పురుగుల మందు తాగి ప్రాణపాయ స్థితిలో ఉన్నట్టు గుర్తించారు. పోలీసులు గౌష్ పాషా వెంటనే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. తన కొడుకు ఆత్మహత్యయత్నానికి బంక్ యాజమానుల వేధింపులే కారణమని బాధి తుడి తల్లి ఎండీ ఫర్వీనా పరకాల పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటి వరకు జైలుకు వెళ్లింది వీళ్లే..?
తాజావార్తలు
-
Radico Khaitan: మత్తులో మునిగి.. లాభాల్లో తేలిన వోడ్కా కంపెనీ! 3 నెలల్లో వందల కోట్ల లాభం..
-
Ramachandra Rao: కర్ణాటక మాజీ డీజీపీ రామచంద్ర రావుకు భారీ ఊరట.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
SRH Vs PBKS: 3 ఓవర్లలోనే మరో రికార్డు నెలకొల్పిన కాటేరమ్మ కొడుకులు.. ఉప్పల్ లో పరుగుల వరద..
-
Mamata Banerjee: రాజీనామాకు ససేమిరా.. సుప్రీంకోర్టుకు మమతా బెనర్జీ..
-
MK Stalin-Rajinikanth: స్టాలిన్ను కలిసిన రజనీకాంత్.. మాజీ సీఎంకు ఓదార్పు
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!