Online Game: ప్రాణాల మీదకు తెచ్చిన ఆన్లైన్ గేమ్.. పురుగుల మందు తాగిన బాధితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Online Game: ఆన్లైన్ గేమ్ ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. ఆన్లైన్ రమ్మీ గేమ్ కోసం పనిచేస్తున్న పెట్రోల్ బంక్ నుంచి లక్షల రూపాయలను వెచ్చించారు. లెక్కలో 6 లక్షల రూపాయలు తేడా రావడంతో పెట్రోల్బంక్ యాజమాన్యం పోలీసులకు పిర్యాదు చేశారు. అందులో పనిచేస్తున్న యువకుడే ఈ పని చేపట్టడాని తెలడంతో.. రికవరీ పేరిట ఇంటిని రాయించుకున్నారు. దీంతో మనస్తాపం చెందిన ఆ యువకుడు పురుగుల మందు తాగిన ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన హనుమకొండలో కలకలం రేపింది.
Read also: Election Commission: లావాదేవీలపై నిఘా పెట్టండి.. రాష్ట్రాలకు ఈసీ లేఖ
Also Read
- OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
- Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్ను లేపేసిన కిల్లర్స్!
- Astro Scam : జ్యోతిష్యం పేరుతో జేబుకు జలక్.. కొత్త సైబర్ స్కామ్ అలర్ట్.!
- OTR : సడన్ గా ఆగిపోయిన గాంధీభవన్ ముఖాముఖి.. కాంగ్రెస్లో మంత్రులపై అధిష్టానం సీరియస్?
హనుమకొండ జిల్లా పరకాలలోని వెలుమవాడకు చెందిన ఎండీ గౌష్ పాషా గుడెప్పాడ్ లోని జీకే పెట్రోల్ బంక్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. గౌష్ పాషా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాందించాలనే ఆలోచనతో రమ్మీ ఆన్లైన్ గేము అలవాటు పడి 6లక్షల రూపాయలలో పొగొట్టాడు. పెట్రోల్ పంపులో మేనేజర్ గా పని చేస్తున్న గౌష్ పాషా పెట్రోల్ పంపు కు సంబంధించిన డబ్బులను ఆన్లైన్ గేమ్ కి ఖర్చు చేశాడు. బంకు యజమాని లెక్కలు చెక్ చేసుకోగా సుమారుగా 6 లక్షల వరకు తేడా రావడంతో షాక్ తిన్నారు. వెంటనే ఈ నెల 18న ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా ఆ డబ్బులు రికవరీ చేసేందుకు గౌస్ పాషా ఇంటిని 100 రూపాయల స్టాంప్ కాగితంపై రాయించుకున్నారు.
Read also: Delhi Liquor Scam: నేడు సుప్రీంలో ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై విచారణ..!
అదే రోజు ఇంటికి చేరుకున్న గౌష్ పాషా ఎంతో కష్ట పడి తన తల్లిదండ్రులు కట్టుకున్న ఇంటిని బంక్ యజమానులు రాయించుకోవడం తెలిస్తే తట్టుకో లేరని మనస్తాపం చెంది ఈ నెల 19న పురుగుల మందు తాగాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని.. మీరంతా తనను మరిచిపోవాలని తల్లి, తమ్ముడికి ఫోన్ చేశాడు. దీంతో వారు పోలీసులను సంప్రదించగా, పరకాల బంధం రోడ్డులో పురుగుల మందు తాగి ప్రాణపాయ స్థితిలో ఉన్నట్టు గుర్తించారు. పోలీసులు గౌష్ పాషా వెంటనే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. తన కొడుకు ఆత్మహత్యయత్నానికి బంక్ యాజమానుల వేధింపులే కారణమని బాధి తుడి తల్లి ఎండీ ఫర్వీనా పరకాల పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటి వరకు జైలుకు వెళ్లింది వీళ్లే..?
తాజావార్తలు
-
RCB vs GT : గుజరాత్పై ఆర్సీబీ ‘రాయల్’ విక్టరీ.. ఏకంగా 92 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోకి..!
-
OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
-
Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
-
Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్ను లేపేసిన కిల్లర్స్!
-
Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!