Addanki Dayakar: టీఆర్ఎస్ పార్టీ బీజేపీ బ్లాక్ మెయిల్ లో ఉంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Addanki Dayakar comments on BJP, Komati Reddy Raj Gopal Reddy: కాంగ్రెస్ పార్టీలో కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాకపుట్టిస్తోంది. రాజగోపాల్ రెడ్డి మంగళవారం తన మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇక త్వరలోనే మునుగోడుకు ఉపఎన్నికలు రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరాలని రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ నేతలు కోమటి రెడ్డి వ్యవహారంపై ఫైర్ అవుతున్నారు. ఇటు బీజేపీతో పాటు అటు కోమటి రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజాగా కాంగ్రెస్ నేత కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. మునుగోడులో ఎన్నికలు రాజగోపాల్ రెడ్డి వ్యాపార ప్రయోజనాల కోసం వచ్చాయని విమర్శించారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీకి వెళ్లి గెలిస్తే వచ్చే ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. చికోటీ కేసులో 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. బీజేపీ ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదని అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ బ్లాక్ మెయిల్ లో ఉందని విమర్శించారు. అందుకే బీజేపీ, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తుందని అన్నారు.
Also Read
- Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
- Engineering College fees: "అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు".. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
- Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
- Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
Read Also: Thummala Nageswara Rao: ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు.. తుమ్మల సంచలన వ్యాఖ్యలు
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడటం బాధాకరమే అని..నష్టమే అని ఆయన అన్నారు. ఈటెల రాజేందర్ తన అస్తిత్వం కాపడుకునే పనిలో పడ్డారని అన్నారు. ఈటెల తన సహజగుణం కోల్పోయారని అద్దంకి విమర్శించారు. టీఆర్ఎస్, బీజేపీలకు కాంగ్రెస్ నేతలే దిక్కయ్యారని ఎద్దేవా చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మోడీ మొహమే నెగిటివ్ అంటూ కామెంట్స్ చేశారు. ఈటెల, రాజగోపాల్ రెడ్డిలు వ్యాపార బానిసలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈటెల కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రాలేదా..? అని ప్రశ్నించారు. బీజేపీకి, టీఆర్ఎస్ పార్టీకి రేవంత్ రెడ్డి టార్గెట్ అయ్యారని.. రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని.. ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారంటూ విమర్శించారు. సోనియా గాంధీ నియమించిన వ్యక్తే కదా.. రేవంత్ రెడ్డి. ఇన్నాళ్లు ఈ విషయంపై ఎందుకు మాట్లాడలేదని రాజగోపాల్ రెడ్డిని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Varun Tej: పవన్ కళ్యాణ్ మాటలు గుర్తుచేసుకున్న వరుణ్ తేజ్..
-
Varanasi: ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసినా ఎలా లీక్ అవుతున్నాయి మైక్?
-
Central Cabinet Decision: బయోగ్యాస్ ఉత్పత్తికి గ్రీన్సిగ్నల్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
Perni Nani: పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటున్నారు.. ప్రభుత్వంపై పేర్ని నాని విమర్శలు
-
Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!