Jayashankar Bhupally: పోలీసులంటే ఓ నమ్మకం.. ప్రజల ప్రాణాలను కాపాడుతారనే భరోసా. కానీ సబ్ ఇన్స్పెక్టర్ని చూస్తే ఆ స్టేషన్లోని వారికి చిరాకు.. చూసిన ఆడవాళ్ళను అనుభవించేదాకా వదలడు. అందుకోసం ఎంతకైనా తెగిస్తాడు. తన సర్వీస్ రివాల్వర్తో బెదిరించి మరీ తన కోరిక తీర్చుకుంటాడు. అలాంటి సంఘటనే ఇది. తన సొంత స్టేషన్లోని లేడీ కానిస్టేబుల్పై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఆ సబ్ డివిజన్ లో ఈ పోలీసు అరాచకం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై సహించలేని ఆ మహిళా హెడ్ కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సైను అదుపులో తీసుకుని కేసు నమోదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
Read also: Union Cabinet Meet: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ!
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ లోని కాళేశ్వరం పోలీస్ స్టేషన్ లో ఎస్సై భవాని సేన్ రాసలీలలు ఒక్కొక్కడి బయటపడుతున్నాయి. పోలీస్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్ పై ఎస్సై భవాని సేన్ వరుసగా హత్యాచారం చేసినట్లు వార్తలు సంచలనంగా మారాయి. ఆమెను తుపాకీతో బెదిరంచి అత్యాచారం చేసినట్లు తెలుస్తుంది. ఈ ఘటన ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు సమాచారం. అయితే ఇన్ని రోజులు ఎవరికి చెప్పాలో తెలియక ఆత్మహత్యే సరణ్యమని భావించిన మహిళా హెడ్ కానిస్టేబుల్.. ధైర్యం తెచ్చుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై భవాని సేన రాసలీలు వెలుగులోకి వచ్చాయి. మహిళా హెడ్ కానిస్టేబుల్ ఫిర్యాదు షాక్ తిన్న ఉన్నతాధికారులు కేసు నమోదు చేశారు. కాలేశ్వరం ఎస్సై భవాని సేన తన రివాల్వర్ తో మహిళా కానిస్టేబుల్ పై గురిపెట్టి పలుమార్లు హత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారని పోలీసులు తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు అర్ధరాత్రి అరెస్టు చేసి భూపాలపల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్సై భవాని సేనను విచారిస్తున్నారు. ఎస్సై పై లైంగిక వెదింపుల కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిన్న రాత్రి కాళేశ్వరం పియస్ కు వచ్చి అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
RK Roja: రుషికొండ భవనాల వివాదంపై స్పందించిన రోజా.. అది తప్పా..?