Tiger attack on Goat: కామారెడ్డి జిల్లాలో హడలెత్తిస్తున్న పులి.. గొర్రెల మందపై దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tiger attack on Goat: ఏజెన్సీ ప్రాంతాలకు తోడు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో బెబ్బులి సంచారం గ్రామాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అడుగుతీసి అడుగు వేయాలంటే జనం జంకుతున్నారు. పంటపొలాల వైపు వెళ్ళాలంటే జడుసుకునే పరిస్థితి ఎదురౌతోంది. కామారెడ్డి ఆదిలాబాద్ , కొమురంభీం, మంచిర్యాల జిల్లాల్లో పులి సంచారం కంటిమీదకునుకు లేకుండా చేస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి మండలం సోమర్యాగడి తండాకు చెందిన అంగోత్ బన్సీ గొర్రెలను మేతకు మేపుకొని తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో గొర్రెల మంద పై చిరుత పులి దాడి చేయడంతో జనం బెబ్బేలెత్తుతున్నారు. గమనించిన స్థానిక గొర్రెల కాపరులు ఆరవడంతో పులి అక్కడి నుంచి పారారయ్యింది. దీంతో భయాందోళనకు గురైన గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. కొద్దిరోజులుగా ఏజన్సీ ప్రాంతాల్లో పులి సంచారం జరుగుతుందని తెలిపిన చర్యలుచేపట్టలేదని మండిపడుతున్నారు. పులుల బోన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Read also: Droupadi Murmu: ఏపీలో 2 రోజుల పాటు రాష్ట్రపతి పర్యటన.. షెడ్యూల్ ఇదే
Also Read
- KTR: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది.!
- Pawan Kalyan: ప్రెస్మీట్కు అయినా అనుమతి ఇస్తారా?.. పవన్ కల్యాణ్ సెటైర్లు!
- CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
- Telangana Formation Day.. సీఎం రేవంత్, కేసీఆర్ శుభాకాంక్షలు.. రాష్ట్ర భవిష్యత్తుపై కీలక సందేశాలు.!
ఇదే ప్రాంతంలో గత రెండు రోజుల క్రితం చిరుత పులి రెండు చిరుత పిల్లలతో సంచరిస్తున్నట్లు పేర్కొన్న గ్రామస్తులు. భీంపూర్ మండలం పిప్పలకోటి గ్రామ సమీపంలోని రిజర్వాయర్ వద్ద బుధవారం తన మూడు పిల్లలతో ఒక పులి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఒక ట్రక్ డ్రైవర్ పులిని వీడియో తీసి షేర్ చేయడంతో అది నెట్టింట వైరల్గా మారింది. పెంగంగా నది మీదుగా నిర్మాణంలో ఉన్న చనకా-కొరాట నీటిపారుదల ప్రాజెక్టు పంప్ హౌస్ సమీపంలో, వ్యవసాయ పొలాల్లో, మండలంలోని వివిధ ప్రాంతాల్లో అటవీ శివారు ప్రాంతాల్లో తాము కూడా పులి కనిపించిందని స్థానికులు తెలిపారు.
Read also: Salaar: ఈ యాక్షన్ ఎపిక్ అనౌన్స్ అయ్యి రెండేళ్లు…
ఇక మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలోని తడోబా అభయారణ్యంలో రెండు పులుల మృతి చెందాయి. వేరే వేరే ప్రాంతాల్లో రెండు పులుల కళేబరాలు లభ్యమయ్యాయి. స్థానిక సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అటవీశాఖ అధికారులు చనిపోయిన పులులు టీ 75, టీ 60 గుర్తించారు. ఎవరు చంపేశారన్నది విచారణ చేపట్టారు. పులులు సంచరిస్తున్నాయని చంపేశారా? లేక వాటి చర్మం కోసం చంపేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
JNU: జేఎన్యూలో మరో వివాదం.. క్యాంపాస్లో బ్రహ్మణ వ్యతిరేక నినాదాలు
తాజావార్తలు
-
Nikhil : స్వయంభు కోసం 45 రోజుల కఠినమైన శిక్షణ తీసుకున్న హీరో నిఖిల్
-
Samsung: సామ్ సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8, ఫోల్డ్ 8 అల్ట్రా డిజైన్ లీక్.. 200MP కెమెరాతో రానున్నాయా?
-
Weather News: మరో 5ఏళ్లు నరకమే.. ఐక్యరాజ్యసమితి హెచ్చరిక.. UN రిపోర్ట్లో ఏముంది?
-
RCB Success Story: ఆర్సీబీ విజయాల వెనుక ‘పంచ పాండవులు’.. మూడో ఐపీఎల్ టైటిల్ కూడా!
-
KTR: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది.!
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!