TS SSC Exams: విద్యార్థులకు శుభవార్త.. 50 శాతం ఛాయిస్ ప్రశ్నలేనట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ విద్యాశాఖ పదో తరగతి విద్యార్థులకు శుభావార్త చెప్పింది. కరోనా కారణంగా సిలబస్ పూర్తి కాకపోవడం, ఆన్లైన్ క్లాస్లు నిర్వహించడం లాంటి కారణాలతో విద్యాశాఖ 50 శాతం ఛాయిస్ ప్రశ్నలతో పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. రాబోయే ఎస్ఎస్సీ పబ్లిక్ ఎగ్జామినేషన్ 2022లో విద్యార్థులకు పెద్ద ఉపశమనంగా, వివిధ విభాగాలలో 50 శాతం ప్రశ్నలకు మాత్రమే సమాధానమిచ్చే అవకాశం ఉంటుంది. ఆబ్జెక్టివ్ పార్ట్లోని అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉండగా ఛాయిస్ ప్రశ్న పత్రాల థియరీ విభాగాలలో మార్పలు చేశారు. “మొత్తంమీద, ఈ సంవత్సరం ఎస్ఎస్సీ పరీక్షలలో ప్రశ్నలలో 50 శాతం ఛాయిస్ ఉంటుంది. మోడల్ ప్రశ్న పత్రాలను స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని ఒక అధికారి తెలిపారు. ముందుగా ప్రకటించినట్లుగా ఎస్ఎస్సీ పరీక్షలు 2022 అన్ని సబ్జెక్టులలో మొత్తం సిలబస్లో 70 శాతం మాత్రమే నిర్వహించబడతాయి. సాధారణ 11 పేపర్లకు బదులుగా ఆరు పేపర్లు మాత్రమే ఉంటాయి.
పరీక్షలు మే 11న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ (గ్రూప్ A), ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-I (కాంపోజిట్ కోర్సు) మరియు ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-II (కాంపోజిట్ కోర్సు)తో ప్రారంభమవుతాయి. SSC పరీక్షలు మే 17న సోషల్ స్టడీస్ పేపర్తో ముగుస్తాయి. OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-I (సంస్కృతం & అరబిక్), OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-II (సంస్కృతం & అరబిక్) మరియు SSC వొకేషనల్ కోర్సు (థియరీ) వరుసగా మే 18, 19 మరియు 20 తేదీల్లో జరుగుతాయి. పరీక్ష ముగిసిన 30 నిమిషాల్లో అన్ని సబ్జెక్టుల్లోని ఆబ్జెక్టివ్ పేపర్లకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
Also Read
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
- Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
ఇప్పటి వరకు 4.81 లక్షల మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 14తో ముగియగా, విద్యార్థులు పరీక్ష రుసుమును రూ. 50 మరియు రూ. 200 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 24 వరకు మరియు మార్చి 4 వరకు చెల్లించవచ్చు. రుసుము కూడా రూ. 500 ఆలస్య రుసుముతో మార్చి 14 వరకు ఆమోదించబడుతుంది. గత సంవత్సరం దాదాపు 5.16 లక్షల మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. అయితే, కోవిడ్ మహమ్మారి కారణంగా పరీక్షలు నిర్వహించబడలేదు. విద్యార్థులు వారి ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కులను పరిగణనలోకి తీసుకుని ఉత్తీర్ణులైనట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
-
Pradeep :తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ల పోరాటం.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రాజప్ప రియల్ స్టోరీ ఇదే!
-
Virat Kohli: “నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు”.. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
-
Green Invicta: గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.45000 డిస్కౌంట్.. చౌక ధరకే సొంతం చేసుకోండి.. 60KM రేంజ్
-
Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..