Site icon NTV Telugu

శంషాబాద్‌లో రూ.25 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత

Shamshabad Airport

Shamshabad Airport

హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్‌ అధికారులు.. జోహాన్నెస్ బర్గ్ నుండి హైదరాబాద్ వచ్చిన జాంబియాకు చెందిన ఓ ప్రయాణికుడి దగ్గర రూ.25 కోట్ల విలువ చేసే 3.2 కేజీల హెరాయిన్‌ను పట్టుకున్నారు.. సినీ పక్కీలో మాదకద్రవ్యాలను మలద్వారంలో తరలిస్తుండగా.. కేటుగాళ్ల గుట్టురట్టు చేశారు.. ఇక, 3.2 కిలోల హెరెయిన్‌ను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ మధ్య తరచూ దేశంలోని అంతర్జాతీయ విమనాశ్రయాల్లో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుపడుతూ వస్తున్నారు.. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లోనూ ఇప్పటికే పలు దపాలుగా హెరెయిన్‌ను పట్టుకున్న సంగతి తెలిసిందే.

Exit mobile version