Bicycles on ORR: ఓఆర్ఆర్ ట్రాక్పై కిరాయి సైకిళ్లు.. గంటకు రూ.50 మాత్రమే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bicycles on ORR: ఔటర్ రింగ్ రోడ్ సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ పై సైకిళ్లు పరుగెత్తనున్నాయి. నగరంలో సైక్లింగ్ను ప్రోత్సహించేందుకు గ్రేటర్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి 24 కిలోమీటర్ల మేర అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సోలార్ లూప్ టాప్ సైకిల్ ట్రాక్ను ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. అంతేకాకుండా, సైకిల్ ట్రాక్పై సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి, దాని వెలుతురులో సౌకర్యవంతంగా సైకిల్పై ప్రయాణించే అవకాశాన్ని కల్పించడానికి ప్రత్యేక చొరవ తీసుకోబడింది. సొంతంగా సైకిళ్లు ఉన్నవారు ఈ ట్రాక్పై నేరుగా సైకిల్ నడపవచ్చని, లేని వారి కోసం అద్దెకు సైకిల్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నార్సింగి హబ్లో మొదటి సైకిల్ స్టేషన్ను ఏర్పాటు చేశామని, 40కి పైగా ఎలక్ట్రిక్ సైకిళ్లతో సహా దాదాపు 200 సైకిళ్లను అందుబాటులోకి తెచ్చామని నిర్వాహకులు తెలిపారు. ఒక్కో సైకిల్ అద్దెకు గంటకు రూ.50 వసూలు చేస్తున్నారు.
Read also: Kejriwal: ఈడీ కస్టడీ నుంచే కేజ్రీవాల్ మరోసారి ఆదేశాలు..
Also Read
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
- Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
- HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
- DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) సైకిల్ స్టేషన్ల నిర్వహణను ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తోంది. 24 కి.మీ ఓఆర్ఆర్ సైకిల్ ట్రాక్లో 4 చోట్ల సైకిల్ స్టేషన్లు ఏర్పాటు చేసి అందులో తెలంగాణ పోలీస్ అకాడమీ జంక్షన్, నానక్రంగూడ, నార్సింగి, కొల్లూరు ప్రాంతాలను సైకిల్ స్టేషన్ల కోసం ఎంపిక చేసి అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించారు. ప్రస్తుతం నార్సింగి హబ్లో అద్దెకు సైకిళ్లు అందుబాటులో ఉన్నాయని, త్వరలో ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. సైక్లింగ్ను ఇష్టపడే వారికి, ఫిట్నెస్ కోసం సైకిల్ తొక్కే వారికి అలాగే ఆఫీసులకు వెళ్లేందుకు ఇది రెట్టింపు ఉపయోగం కానుంది. సైకిల్ ట్రాక్లో ప్రతి కిలోమీటరు దూరాన్ని తెలిపేలా బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా సైకిల్ ట్రాక్లోకి ఇతర వాహనాలు రాకుండా మీటింగ్ పాయింట్లు, ట్రాక్ కలరింగ్, సేఫ్టీ సంకేతాలు, విద్యుత్ దీపాలు, మధ్యలో విశ్రాంతి తీసుకోవడానికి ఇతర భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. దీని వల్ల ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం ఉండదు. ముఖ్యంగా రాత్రి వేళల్లో సైక్లింగ్ చేసేందుకు వీలుగా విద్యుత్ దీపాలతో వెలుతురును అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
Kejriwal: ఈడీ కస్టడీ నుంచే కేజ్రీవాల్ మరోసారి ఆదేశాలు..
తాజావార్తలు
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్… కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!