NTV Telugu Site icon

Lok Sabha Results 2024: మల్కాజిగిరిలో 1 లక్ష 4 వేల983 కోట్ల మెజారిటీతో ఈటల

Etala Rajender

Etala Rajender

Lok Sabha Results 2024: మల్కాజిగిరి పార్లమెంట్ ఓట్ల మూడో రౌండ్ కౌంటింగ్ పూర్తయింది. మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ 1 లక్ష 4 వేల983 ఓట్ల మెజారిటీతో మొదటి స్థానంలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ అభ్యర్థికి ఒక లక్ష 85 వేల 6 ఓట్లు పోలయ్యాయి. కాగా బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఇప్పటివరకు రెండు లక్షల 89 వేల 989 ఓట్లు సాధించారు. ఇక చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో (చేవెళ్ల, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం,వికారాబాద్, పరిగి, తాండూరు) అధికారిక ప్రకటన ప్రకారం.

3 వ రౌండ్ ముగిసే సరికి బీజేపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి 124815 కాగా.. కాంగ్రేస్ గడ్డం రంజిత్ రెడ్డి 78174 కాగా.. బీఆర్ఎస్ కసాని 25680 సాధించారు కాగా..
3 వ రౌండ్ లో 46641 ఓట్లతో బీజేపీ లీడ్ లో ఉంది. కాగా.. హైదరాబాద్ ఎంపీ సీటును ఎంఐఎంకే సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈసారి బీజేపీ నుంచి మాధవీలత గట్టి పోటీ ఇచ్చారు. అయితే ఎట్టకేలకు అసదుద్దీన్ ఒవైసీ తెరపైకి వచ్చారు. ఆయనకు ఇప్పటి వరకు 112569 ఓట్లు రాగా.. మాధవిలత్ కు 95216 ఓట్లు వచ్చాయి. ఈ ఇద్దరి మధ్య ముప్పై వేల ఓట్ల తేడా ఉంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి సమీర్ 12195 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు.