పెళ్లి పత్రికలో పేర్ల కోసం జరిగిన ఘర్షణ కత్తిపోట్లకు దారితీసిన ఘటన సికింద్రాబాద్ తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ నగర్ లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు తెలిపారు.
వివరాలలోకి వెళితే… మూడు రోజుల క్రితం చంద్రశేఖర్ నగర్ కు చెందిన సురేష్ వివాహం జరిగింది.. అయితే పెళ్లి పత్రికలలో తమ పేర్లు ఎందుకు పెట్టలేదని పెళ్లి రోజే సర్వేశ్ కుటుంబ సభ్యులతో గొడవకు దిగాడు..సురేష్ సోదరి బాలమణిని దూషించడు. అయితే బందువులందరు సర్ది చెప్పి పెళ్లిలో గొడవ తరువాతి రోజు మాట్లాడదామని తెలిపారు. ఈ రోజు ఉదయం బలమని తన కుటుంబ సభ్యులు, పెళ్లికి వచ్చిన బందువులను తీసుకొని సర్వేశ్ ఇంటికి వెళ్ళింది. సర్వేశ్ సోదరుడు శేఖర్ వచ్చిన వారిపైకి రెచ్చిపోయాడు. ఆవేశంతో ఇంట్లోకి సర్వేశ్ కు తల్లి కత్తి ఇచ్చిందని.. ఆ కత్తితో తమపై విచక్షణ రహితంగా దాడి చేశాడని తెలిపారు. సర్వేశ్ చేతిలోని కత్తి తీసుకొని శేఖర్ కూడా దాడి చేశాడని తెలిపారు. ఈ దాడిలో ఎస్ ప్రవీణ్ (30) నోముల పరశురాము(35) డి యాదగిరి, (42)ఎన్ ప్రతాప్ కుమార్ (32) తీవ్రగాయాల పాలయ్యారు. గాయాలతోనే పోలీస్ స్టేషన్ వచ్చిన బాధితులు.. దారి పొడవునా పోలీస్ స్టేషన్ లో సైతం రక్తం మరకలు.. పోలీసులు వెంటనే బాధితులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిందితులు అప్పటికే పరారయ్యారు. ఇందులో విఆర్ఏ ఎస్ ప్రవీణ్, నోముల పరశురాము పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేస్ నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.