NTV Telugu Site icon

రాష్ట్రంలో 104, 108 సేవలను నిర్వీర్యం చేశారు: ఉత్తమ్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి విమర్శించారు. వైద్యారోగ్య శాఖలపై సమీక్ష కోసం అధికారులే సీఎం ఫామ్​హౌస్​కు వెళ్లాలా అని నిలదీశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్​ లేక కోవిడ్​ బాధితులు మరణిస్తే సర్కార్​ది బాధ్యత కాదా అని ఉత్తమ్​ ప్రశ్నించారు. కొవిడ్​ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తామని గత ఏడాది సెప్టెంబరులో ముఖ్యమంత్రి చెప్పారని.. ఇంతవరకు ఆదిశగా చర్యలు తీసుకోలేదని ఉత్తమ్​ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 104, 108 సేవలను నిర్వీర్యం చేశారని విమర్శించారు.