Vivo S2 : దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత వివో (Vivo) నుండి S సిరీస్ స్మార్ట్ఫోన్లను మళ్లీ భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతుంది. లీకైన సమాచారం ప్రకారం.. కొత్త Vivo S2 స్మార్ట్ఫోన్ ఆగస్టు తొలి వారంలో భారత్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగే ప్రత్యేక సేల్లో ఈ ఫోన్ అమ్మకాలు జరగనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే Vivo S2 భారతీయ ప్రమాణాల సంస్థ BIS సర్టిఫికేషన్ వెబ్సైట్లో కనిపించడం కూడా ఈ ఫోన్ లాంచ్ సమీపంలోనే ఉందనే సంకేతాలను ఇస్తోంది. లీకుల ప్రకారం.. Vivo S2 ధర రూ.50 వేలలోపు ఉండే అవకాశం ఉంది. ఇది 2019లో రూ.17,990 ధరతో విడుదలైన Vivo S1తో పోలిస్తే భారీ పెరుగుదల. అప్పట్లో AMOLED డిస్ప్లే, ఇన్-డిస్ప్లే ఫింగర్ప్రింట్ సెన్సార్, 32MP సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లతో Vivo S1 మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ప్రస్తుతం Vivo S2కు సంబంధించిన అధికారిక స్పెసిఫికేషన్లను కంపెనీ వెల్లడించలేదు. ప్రాసెసర్, కెమెరా, డిస్ప్లే తదితర వివరాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. అయితే ఈ ఫోన్లో ఫోటోగ్రఫీ, ప్రీమియం డిజైన్, లేదా ప్రత్యేక AI సాఫ్ట్వేర్ ఫీచర్లు ప్రధాన ఆకర్షణలుగా ఉండవచ్చని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

