Fact Check: “3 నెలల ఫ్రీ రీఛార్జ్.. డిసెంబర్ 30 వరకే ఛాన్స్”.. ఈ మెసేజ్ నిజమేనా ?
- సోషల్ మీడియా వైరల్ అవుతున్న మెసేజ్
- పీఎం 3 నెలల ఉచిత మొబైల్ రీఛార్జ్ పథకం
- పోస్ట్లో పేర్కొన్న లింక్
- ఈ మెసేజ్లో నిజమెంత?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒకటి వైరల్ అవుతూనే ఉంటుంది. కొన్నిసార్లు ఫిషింగ్ లింక్లు కూడా వైరల్ అవుతాయి. ఈ లింక్లను క్లిక్ చేయడం వలన వినియోగదారులకు సమస్యలు పెరుగుతాయి. అలాంటి ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ప్రధానమంత్రి ఉచిత రీఛార్జ్ పథకం కింద.. భారతీయ వినియోగదారులందరికీ 3 నెలల ఉచిత మొబైల్ రీఛార్జ్ లభిస్తుందని పేర్కొన్నారు. డిసెంబర్ 30లోపు ఈ రీఛార్జ్ని పొందండని రాసుకొచ్చారు. పోస్ట్తో పాటు లింక్ కూడా షేర్ చేశారు. దానిపై క్లిక్ చేయడం ద్వారా 84 రోజుల ఉచిత రీఛార్జ్ను పొందవచ్చు అని తెలిపారు.
నవంబర్ 27న వైరల్ పోస్ట్..
నవంబర్ 27, 2024న ఫేస్బుక్ (Facebook) వినియోగదారు రుషికేష్ కాలే ఈ వైరల్ పోస్ట్ను షేర్ చేశాడు. క్యాప్షన్లో “ప్రధాన మంత్రి ఉచిత రీఛార్జ్ పథకం కింద.. భారతదేశంలోని వినియోగదారులందరూ 3 నెలల ఉచిత మొబైల్ రీఛార్జ్ పొందడం ప్రారంభించారు. నేను కూడా 84 రోజుల ఉచిత రీఛార్జ్ ను పొందాను. మీరు కూడా క్రింద ఇచ్చిన లింక్పై క్లిక్ చేయడం ద్వారా 84 రోజుల ఉచిత రీఛార్జ్ పొందవచ్చు. ఈ పథకం 30 డిసెంబర్ 2024 వరకు మాత్రమే ఉంటుంది.” అని పేర్కొన్నాడు.
Also Read
- Redmi Watch 6: కొత్త Redmi Watch 6 లాంచ్.. AMOLED డిస్ప్లే, GPS ఫీచర్లతో అదిరింది
- WhatsApp Shutdown ALERT: అలర్ట్.. ఆ తేదీ నుండి ఈ స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. లిస్ట్ ఇదే
- Honor Play 80 Plus: హానర్ ప్లే 80 ప్లస్ విడుదల.. 7,500mAh బ్యాటరీ, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్
- Motorola Razr Fold: మోటరోలా రేజర్ ఫోల్డ్ త్వరలో భారత్ లో విడుదల.. 80W ఛార్జింగ్, 6000mAh బ్యాటరీ
విచారణ…
లింక్ ను పరీక్షించేందుకు మేము వైరల్ పోస్ట్లో ఉన్న లింక్ యొక్క URLని చెక్ చేశాం. పోస్ట్లో ఇచ్చిన లింక్ URL techtadaka.com అని కనుగొన్నాం. ఇది ఏ అధికారిక వెబ్సైట్కి సంబంధించి లింక్ కాదని స్పష్టమైంది. అనంతరం మేము ఇలాంటి పథకం ఏమైనా కేంద్రం ప్రవేశ పెట్టిందా? అని చెక్ చేశాం. అలాంటి పథకం లేదని తెలుసుకున్నాం. అంతే కాకుండా వైరల్ అవుతున్న మెసేజ్లో జియో, ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్, తదితర టెలికాం కంపెనీల పేర్లు ప్రస్తావించారు. ఆయా టెలికాం కంపెనీల అధికారిక సైట్లు చెక్ చేశాం. అందులో కూడా ఇలాంటి స్కిం వివరాలు కనిపించలేదు.
నిపుణుల సమాచారం..
అయితే.. ఈ మెజేస్పై నిపుణులను సంప్రదించాం. వారు మాట్లాడుతూ.. “ఇలాంటి లింక్లను వినియోగదారులను మోసం చేయడానికి వాడుతుంటారు. వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి ట్రై చేస్తుంటారు. ఇలాంటి లింక్లపై క్లిక్ చేసే ముందు.. మీరు URLని జాగ్రత్తగా తనిఖీ చేయాలి. ఈ మెసేజ్ పూర్తిగా నకిలీది. వినియోగదారులు జాగ్రత్తలు వహించాలి.” అని టెలికాం నిపుణులు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!